Top Stories

జగన్ అంటే ఇదీ!

ఏపీలో గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపులో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పోషించిన పాత్ర అసాధారణమైనది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో వర్మ పవన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పవన్ కు రాష్ట్రమంతా పర్యటించి కూటమి అభ్యర్ధుల కోసం ప్రచారం చేసుకునే వీలు కలిగింది. దీనికి ప్రతిగా కూటమి అధికారంలోకి వచ్చాక వర్మకు తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చినా అలా జరగలేదు. ఈ నేపథ్యంలో వర్మ తన రాజకీయం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి కూటమి ప్రభుత్వం 183 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ గతంలో వైసీపీ ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించేశారు. పవన్ తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ ఈ క్యాంటీన్ ప్రారంభించారు. దీన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసారు.

వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఇందులో తప్పేమీ లేకపోయినా ప్రభుత్వం ఆగస్టు 15న ఒకేసారి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో, పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో వర్మ ఇలా సొంతంగా అన్న క్యాంటీన్ ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా పేదోడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేసిన పనే కావడంతో అంతా ఆయన్ను అభినందిస్తున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ పై అసంతృప్తితోనే.. ఆయనకు వ్యతిరేకంగానే వర్మ ఇలా అన్నా క్యాంటీన్లను పవన్ కు చెప్పకుండానే ప్రారంభించాడని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories