కూటమి కట్టారు.. చంద్రబాబు, పవన్, బీజేపీ, పచ్చ మీడియా ఏకమైనా సరే జగన్ వణకలేదు. బెదరలేదు. భయం జగన్ బ్లడ్ లోనే లేదని నిరూపితమైంది. అవును .. ఎందుకంటే ఆయన ప్రజలనే నమ్ముకున్నాడు. ప్రజలనే దేవుడిగా భావించారు. అందుకే ఒంటరిగా ముందుకెళుతున్నాడు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రక్తంలో భయం లేదని మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ను అనుసరించే వారు కూడా ఎవరికీ భయపడరని ఆమె అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేయడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు ఎవరూ తప్పు చేయలేదని, ఈవీఎం మోసం, అవకతవకల ద్వారా కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
సూపర్ – 6 పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించిన వారికి సిగ్గుచేటు. గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదన్నారు. మహాకూటమి హనీమూన్ అయిపోయిందని హెచ్చరించారు. న్యాయమైన విధానాలు రూపొందించే మహాకూటమి వైపే అందరూ ఉన్నారని అన్నారు. ఉద్యోగులు చట్టవిరుద్ధంగా పనిచేసినప్పుడు వేధింపుల ఫిర్యాదులు అనివార్యం. వైసీపీ నేతలంతా తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని మాజీ మంత్రి రోజా అన్నారు.