Top Stories

గడ్డి పీకుతున్నావా పీకే.. పవన్ కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన జడా శ్రవణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మహిళల మిస్సింగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన ఆడపిల్లల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో గడిచిన కొద్ది రోజుల నుంచి 25 మంది మహిళలు కనిపించడం లేదంటూ ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, వీటిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ గతంలో వ్యక్తం చేసిన ఉద్దేశం ప్రకారం వీరందరినీ ఏ విదేశాలకు తీసుకువెళ్లి అమ్మేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి గతంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే వీరంతా వ్యభిచార వృత్తిలోకి వెళుతున్నట్టుగానే భావించాలా.? అని జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలు కనిపించకుండా పోయిన ఆయనకు పట్టడం లేదని, పవన్ కళ్యాణ్ కుప్పం నియోజకవర్గానికి కూడా డిప్యూటీ సీఎం కాబట్టి దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, దీనిపై సీఎం స్పందిస్తున్నారో లేదో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన ఆడ పిల్లలు బతికున్నారో.. లేదో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించకుండా పోయిన ఆడపిల్లల జీవితాలు గురించి తన ఆందోళన అంతా అని, సదరు మహిళల గురించి డిప్యూటీ సీఎం ఒక్క ఫోన్ కాల్ చేయాలని సూచించారు.

కుప్పం నియోజకవర్గంలోని పోలీసులకు డిప్యూటీ సీఎం ఫోన్ చేస్తే హెలికాప్టర్ లో వెళ్లి అమ్మాయిలను తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తాను ఒకటే కోరుతున్నానని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు గురించి పట్టించుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ లో బిజీగా ఉన్నారని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పట్టించుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే మిలిటరీ హెలికాప్టర్లు మొత్తం దిగుతాయని, కనిపించకుండా పోయిన అమ్మాయిలు అందరిని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరుగుతున్న ఈ వ్యవహారాలపైన దృష్టి సారించాలని ఆయన అంటూ పవన్ కళ్యాణ్ కు ఆయన సూచించారు. ‘నాయన సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా విను ఇవన్నీ ఎఫ్ఐఆర్లు సిగ్గుండాలి. మీ ముఖ్యమంత్రి కార్యాలయానికి.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నవాళ్ళకి’ అంటూ జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జడ శ్రవణ్ మాట్లాడిన మాటలు, గతంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీపై చేసిన ఆరోపణల వీడియోను మిక్స్ చేసి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories