Top Stories

టీడీపీలో ‘రఘురామ’ తిరుగుబాటు

ఏపీలో రఘురామకృష్ణంరాజు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి వైసీపీ ప్రభుత్వంలో స్వపక్షంలో విపక్షంగా మారి ఆయన విసిరిన సైటర్లు, అధినేత జగన్ పై చేసిన పోరాటం, అందులో పోలీసు కస్డడీలో హింస, కోర్టు కేసులు ఇవే. ఇప్పుడు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన శైలిని మార్చుకోలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే.

సహజంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారనే పేరున్న రఘురామకృష్ణంరాజు తనకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు. చంద్రబాబు భయపడే కులాలు కొన్ని ఉంటాయి, నచ్చని కులాలు కూడా ఉండొచ్చు. భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి నచ్చని కులాన్ని పక్కనబెట్టొచ్చని రఘురామ చెప్పుకొచ్చారు. బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, క్షత్రియ కులంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గెలిచినా ఇవ్వలేదని రఘురామ ఆరోపించారు.

రఘురామ కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రఘురామ గతంలోనూ వైసీపీ ప్రభుత్వంలో రెబెల్ గా ఉన్నారని కొందరు అంటుంటే.. మరికొందరు అంత తొందరెందుకని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మాత్రం మారదని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు అయితే ఏకంగా సీఎం చంద్రబాబు తనకు నచ్చని కులాన్ని తొక్కేస్తారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తొలుత స్పీకర్ లేదా మంత్రి పదవి ఆశించిన ఆయన.. ఏదీ దక్కకపోవడంపై అసంతృప్తితోనే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనా రఘురామ వ్యాఖ్యల వేడి ఇప్పుడు టీడీపీ అధిష్టానాన్ని తాకుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories