ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఎంచుకున్న ప్రచార విధానం ఆటో ప్రయాణం. అయితే, ఇది చాలామందికి కామెడీ స్కిట్లా కనిపించింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చంద్రబాబు ఆటోలో కూర్చుని ఫోజులిస్తూ కనిపించారు. మొదట వెనక సీట్లో కూర్చుని ఫోటోలకు, మీడియాకు ఫోజులిచ్చారు. కానీ అది అంతగా వర్కవుట్ కాలేదేమో, వెంటనే ముందుకు వచ్చి ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్నారు. ఈ మొత్తం తతంగం పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీం ప్లాన్ ప్రకారం జరిగిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఈ వీడియోలో ఆటో డ్రైవర్తో చంద్రబాబు ముచ్చటించిన తీరు, చివరిలో డబ్బులు ఇచ్చి, ఆటో డ్రైవర్ ఆయన కాళ్ళకు మొక్కిన దృశ్యం ఒక స్కిట్లా ఉందంటూ చాలామంది విమర్శిస్తున్నారు. ఇది అంతా ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కాదని వారు అంటున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల పాటలను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “ఆటోలో కూర్చుని ఫోజులు ఇవ్వడం కాదు, నిజమైన సమస్యలు పరిష్కరించండి” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రచార శైలిపై సెటైర్లు వేస్తూ, ఈ వీడియోను కామెడీగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇలాంటి ప్రచార ఆర్భాటాలు ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ప్రశ్నార్థకమే. రాజకీయ నాయకులు నిజమైన సమస్యలపై దృష్టి సారించి, ప్రజలతో మమేకమవ్వడం వల్లనే ప్రజల మన్ననలను పొందగలుగుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.