Top Stories

నేను చనిపోతున్నాను: ఆంధ్రజ్యోతి రిపోర్టర్

కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆత్మహత్య రేపు చేసుకుంటానంటూ విడుదల చేసిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తాను రేపు చనిపోతున్నానని, దీనికి కారణం ఆంధ్రజ్యోతి కామారెడ్డి జిల్లా స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ అని ఆయన ఆరోపించారు.

ఆత్మహత్యాయత్నం చేసిన ఈ రిపోర్టర్ గత 17 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతిలో పనిచేశానని వీడియోలో పేర్కొన్నారు. “కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ నన్ను డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారు. నెల రోజుల నుండి నన్ను హింసిస్తున్నారు. నేను ఇంకా బ్రతకను” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పలువురు జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం, ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్లపై సర్క్యులేషన్స్, యాడ్స్ కోసం తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఒత్తిడి కారణంగానే రిపోర్టర్లు డబ్బులు వసూలు చేయాల్సి వస్తుందని, ఈ క్రమంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “డబ్బుల కోసం పీల్చిపిప్పి చేసి రిపోర్టర్ చావుకు కారణమయ్యారా?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం, పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. జర్నలిస్టుల జీవితాల్లో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/TeluguScribe/status/1939519123710517457

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories