ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి పునాది అయిన మానవ హక్కుల పరిరక్షణే ఈ రాష్ట్రంలో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు మానవ హక్కుల కమిషన్కు చైర్మన్, సభ్యులను నియమించకపోవడం ఆ పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
మానవ హక్కుల కమిషన్ ప్రాధాన్యం
ఒక రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ అనేది పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు కవచంలాంటిది. పోలీస్ దౌర్జన్యం, అక్రమ నిర్బంధాలు, సామాజిక అన్యాయం, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రజలకు న్యాయం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ ఖాళీగా ఉండటమే పరిపాలనా నిర్లక్ష్యం కాదు, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దెబ్బ అని చెప్పుకోవాలి.
ప్రజల మధ్య గాఢంగా వినిపిస్తున్న మాట ఏంటంటే “ఆంధ్రప్రదేశ్ను నేరస్థులు పాలిస్తున్నారు” అన్నది. సాంఘిక భద్రత క్షీణిస్తోంది.రాజకీయ ప్రతీకారాలు విపరీతంగా పెరిగాయి.మానవ హక్కుల ఉల్లంఘనలు కేసులుగా మారకముందే నొక్కిపెట్టబడుతున్నాయి.శాసన, పాలన వ్యవస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడబడుతున్నాయి.ఈ పరిస్థితుల్లో అధికారంలో కూర్చున్నవారు న్యాయం చేయడం కంటే, తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే పెద్ద ప్రాధాన్యంగా మలచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల పక్షం కాకుండా, నేరస్థుల పక్షాన పనిచేస్తోంది అనే భావన రోజురోజుకీ బలపడుతోంది. మానవ హక్కుల కమిషన్ను ఖాళీగా ఉంచడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్లో నేటి పరిస్థితులు ఘోరమైనవిగా మారాయి. నేరస్థుల పరిపాలన కింద ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మానవ హక్కుల కమిషన్ను వెంటనే పునరుద్ధరించి, చైర్మన్, సభ్యులను నియమించడం ద్వారా కనీస ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే “ప్రజాస్వామ్యం” అనే పదం ఆంధ్రప్రదేశ్లో కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది.