Top Stories

అదీ జగన్ అంటే.? లేదా జగన్ జీతం తీసుకోవడం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. పది నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీలో సమూల మార్పులు చేస్తూ, పార్టీని వీడిన వారి స్థానంలో కొత్త నాయకులను నియమిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఉగాది తర్వాత జిల్లాల్లో పర్యటించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా, తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో భారీ ప్రజా దర్బార్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే ఏడుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రిజిస్టర్లో సంతకాలు పెట్టారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం లేదని స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.

గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. “వై నాట్ 175” అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ, చాలా జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఐదారు జిల్లాల్లో కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో నిబంధనల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్పీకర్ కూడా స్పష్టతనిచ్చారు. అయితే, తమకు ప్రతిపక్ష హోదా కల్పించే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కానీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మరియు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన సభకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటనలు చేశారు. కొంతమంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, వేగం మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వర రాజు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధలు ఇలా చేస్తున్నారని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందిస్తూ, ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా కేవలం సంతకాలు పెట్టడంపై విచారణ జరిపించాలని, ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేల జీతాల అంశం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాల అంశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. అయితే, జగన్మోహన్ రెడ్డి తరహాలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Trending today

బాబు గారు 20 లక్షల కోట్ల ఉద్యోగాల కథ

ఆంధ్రప్రదేశ్‌లో గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని...

మేడారంలో కుక్కకు తులాభారం.. హీరోయిన్ చెప్పిన సత్యం

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం)...

బాబు గారు మళ్లీ మొదలెట్టారు..

ఈరోజు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం...

పవన్ కళ్యాణ్ ను ఓడించే జగన్ మాస్టర్ ప్లాన్ ఇదీ

పిఠాపురం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినది పవన్ కళ్యాణ్...

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

Topics

బాబు గారు 20 లక్షల కోట్ల ఉద్యోగాల కథ

ఆంధ్రప్రదేశ్‌లో గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని...

మేడారంలో కుక్కకు తులాభారం.. హీరోయిన్ చెప్పిన సత్యం

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం)...

బాబు గారు మళ్లీ మొదలెట్టారు..

ఈరోజు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం...

పవన్ కళ్యాణ్ ను ఓడించే జగన్ మాస్టర్ ప్లాన్ ఇదీ

పిఠాపురం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినది పవన్ కళ్యాణ్...

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

ABN రాధాకృష్ణ, NTV చౌదరీలు ఆంబోతులు.. పోల్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది....

మగాళ్లు ఆ పని చేస్తారు… రెచ్చిపోయిన రేణు దేశాయ్

జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు...

tdp mla controversy : టీడీపీ ఎమ్మెల్యే బర్త్ డే.. అమ్మాయిలతో ఇలా ఎంజాయ్

tdp mla controversy : చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్‌నాయుడు...

Related Articles

Popular Categories