Top Stories

అది 1996.. బాబుగారి శాడిజం కథ

*సొంత పిల్లనిచ్చిన మామనే గద్దెదించి సీఎం అయిన చరిత్ర బాబు గారిది.. అందుకే వైసీపీ ఎప్పుడూ అంటుంది.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో మానవత్వం మట్టుకు కూడా కనిపించదని… ఆయన చూపించే ప్రేమాభిమానాలన్నీ మాటలకు మాత్రమే పరిమితం. ఇచ్చే హామీలు ఎన్నికలు వరకే. ఈ విషయం రాష్ట్రంలోని చాలా మందికి తెలుసు. అతికొద్ది మందికి మాత్రమే ఆయన నిజ స్వరూపం తెలియదు. అటువంటి నిజాల్లో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. వైసీపీకి చెందిన అధికార ప్రతినిధి శ్యామల ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంతో ఎంతో మంది ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. శ్యామల చెప్పిన విషయంలోకి వెళితే.. అది 1996 నాటి కథ.

అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఒక యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన యువతి వైద్య ఖర్చులు కోసం ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిలో ఏమాత్రమైనా మానవత్వం ఉండుంటే ఆయనే స్వయంగా బాధిత యువతిని పరామర్శించి వైద్యం చేయిస్తామని ప్రకటించాలి. కానీ, ఆయన ఆ పని చేయలేదు. పైగా కోర్టు ఐదు లక్షలు వైద్య ఖర్చులకు ఇవ్వాలని చెప్పిన విషయాన్ని బేఖాతరు చేస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ విషయంపై అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా చంద్రబాబును విమర్శించారు. ఆడ పిల్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదా..? చంద్రబాబు అంటూ వైఎస్‌ఆర్‌ ప్రశ్నించారు. ఇదీ చంద్రబాబు శాడిజంలోని ఒక కథ మాత్రమే. ఇలాంటివి చంద్రబాబు జీవితంలో కోకొల్లలు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మానవత్వం, సంక్షేమం గురించి మాటలు చెబుతుంటే.. అప్పటి విషయాలు తెలిసిన ఎంతో మంది నవ్వుకుంటున్నారు. ఇదీ సార్‌ చంద్రబాబు నాయుడు మార్క్‌ శాడిజం అంటూ ఈ ఘటనను తాజాగా మీడియా ముఖంగా శ్యామల మరోసారి బహిర్గతం చేయడంతో దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories