బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు కూడా అందలేదని ఆరోపించారు. నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల విమర్శలు వైరల్ అయ్యాయి.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ బుడమేరు పాపంజగన్ దేనని మొత్తం తమ పాపాన్ని జగన్ పై నెట్టేసింది. ఎంత దారుణమంటే ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ తర్వాత అసలు ఆ హామీనే నెరవేర్చలేకపోయాడు. ఇప్పటికీ దాటవేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు మొత్తం జగనే కారణమని వాదిస్తున్నాడు.
అయితే అందరూ వదిలినా వివాదాస్పద జర్నలిస్టు జాఫర్ ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మంత్రి నిమ్మలతో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందులో బుడమేరు వరద పాపం మీదేనని జాఫర్ సూటిగా ప్రశ్నించాడు. కానీ నిమ్మల కూడా దీనికి ‘ఇది జగన్ మోహన్ రెడ్డి పాపమే.. బుడమేరుకు శాపంగా మారింది’ అని అన్నాడు.
దీనిపై జాఫర్ ‘తాను పరిశోధన చేశానని.. ఇది 15 ఏళ్ల నుంచి చేసిన పాపమని.. మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన నిర్వాకమని.. దీనికి జగన్ కు ఏంటి సంబంధం అంటూ చెడుగుడు ఆడేశాడు. దీంతో మంత్రి నిమ్మల నోట మాట రాలేకుండా పోయింది.. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.