Top Stories

జగన్ ఎంట్రీ ఇస్తే ఇట్లుంటదీ మరీ..

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన స్వస్థలం పులివెందులలో అడుగుపెట్టడంతో పట్టణం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగింది. జగన్ ఎంట్రీతోనే జనసంద్రం కదిలింది. రోడ్లన్నీ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయాయి. “జగన్.. జగన్..” నినాదాలతో పులివెందుల వాతావరణం కంపించింది.

ఈ సందర్భంగా కడప నూతన మేయర్ పాకా సురేష్ జగన్‌ను కలుసుకుని శుభాకాంక్షలు అందించారు. నూతన మేయర్‌ను జగన్ హృదయపూర్వకంగా అభినందించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా జగన్‌ను కలిసి పర్యటనకు స్వాగతం పలికారు. ఈ భేటీలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పులివెందుల చేరుకున్న అనంతరం జగన్ భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి ప్రత్యక్షంగా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

రేపు బుధవారం (డిసెంబర్‌ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్‌ హాల్‌లో నిర్వహించే క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్‌ ఆఫీస్‌లో మరోసారి ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. ఆ రాత్రి కూడా అక్కడే బస చేస్తారు.

గురువారం డిసెంబర్‌ 25 ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. వరుస కార్యక్రమాలతో మూడు రోజులపాటు పులివెందుల రాజకీయ వాతావరణం హీట్ ఎక్కనుంది.

మొత్తానికి జగన్ పులివెందుల ఎంట్రీ మరోసారి తన పట్టు ఏమిటో చూపించింది. నాయకుడు వస్తే ఇలా ఉండాలి అంటూ అభిమానులు షేకింగ్ వీడియోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

 

Trending today

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Topics

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

జనసేన పై పెద్ద రాజకీయ కుట్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే...

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు...

Related Articles

Popular Categories