Top Stories

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ మొదటి నుంచీ అమరావతి అంశంలో తడబడుతూ వస్తున్నప్పటికీ, ఇప్పుడు సరికొత్త వ్యూహానికి పూనుకుంటున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అప్పట్లో జగన్‌ కూడా దానికి ఎత్తిపోతలుగా నిరసన తెలియచేయలేదు. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకత రాజకీయంగా సమస్యలు తెచ్చిపెడుతుందన్న ఆలోచన ఆయనకు ఉండేది. అప్పుడు జగన్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యూహాత్మకంగా వినియోగించారు. రైతులు ఇచ్చిన భూముల విషయంలో అసంతృప్తి ఉన్నవారిని ప్రోత్సహించి, కోర్టుల్లో కేసులు వేయించడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు. ఆ కేసుల మీద వస్తున్న తీర్పులను వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది.

తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా బీసీ నాయకురాలు కాండ్రు కమలను నిలిపారు. కానీ నారా లోకేష్ ఘనవిజయం సాధించడంతో ఆ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలం కాంగ్రెస్‌లోకి వెళ్లి మళ్లీ వైసీపీ లోకి తిరిగివచ్చారు. ఎన్నికల్లో పార్టీకి సపోర్ట్ ఇచ్చినా విజయాన్ని సాధించలేకపోయారు.

ఇప్పుడు పరిస్థితులు మారడంతో జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై అవినీతి, లోపాలను బయటకు తీసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆళ్లను ఇన్‌చార్జ్ చేయాలని జగన్ నిర్ణయించారని సమాచారం. పార్టీ స్థాయిలో అధికారిక బాధ్యతలు అప్పగించి, అమరావతి అంశంపై పూర్తి దృష్టి పెట్టేలా ఆళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ఒకప్పుడు వదిలేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్‌కు మళ్లీ అవసరమయ్యారు. అందుకే, ఆయనను పిలిచి మరీ అమరావతిలో కీలక పాత్ర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories