Top Stories

టీడీపీని ఉతికి ఆరేసింది

మెడికల్ కాలేజీల వ్యవహారంలో టీడీపీ, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి చెంప చెల్లుమనేలా సమాధానం లభించింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టిన కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) తాజాగా 60 పీజీ సీట్లను కేటాయించడం, పచ్చ ప్రాపగాండాను పూర్తిగా తిప్పికొట్టింది.

వైసీపీ అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ
“జగన్ గారు మెడికల్ కాలేజీలు కట్టలేదు అని టీడీపీ నేతలు, పచ్చ మీడియా ఎడా పెడా మాట్లాడారు. కానీ కాలేజీలు లేనట్లయితే NMC పీజీ సీట్లు ఎలా కేటాయిస్తుంది? ఇదే నిజానికి సమాధానం” అని అన్నారు.

మల్లేశ్వరి మండిపడుతూ “కూటమి ప్రభుత్వం గొంతులో ఎలక్కాయ పడింది. జీవో లేదు, కాలేజీ లేదు, ఏఐ వీడియోలతో ప్రజలను మోసం చేయాలని చూశారు. కానీ ఇప్పుడు వాస్తవం బయటపడింది. జగన్ ప్రభుత్వం నిర్మించిన కాలేజీలకు NMC సీట్లు కేటాయించడంతో వారి అబద్ధాలు బట్టబయలయ్యాయి” అని ధ్వజమెత్తారు.

జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెడికల్ ఎడ్యుకేషన్ చేరేలా, ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిలో పలు కాలేజీలు ఇప్పటికే పనిచేస్తుండగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి.

వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు “కాలేజీలు లేవన్న టీడీపీ, ఎల్లో మీడియా ఇప్పుడు జగన్ నిర్మించిన కాలేజీలకే NMC సీట్లు ఎందుకు ఇచ్చిందో సమాధానం చెప్పాలి.”

ప్రజల ఆరోగ్యం, విద్యా అవకాశాల కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరోసారి సాక్ష్యాలతో రుజువయ్యాయి. పచ్చ మాఫియా దుష్ప్రచారానికి ఇది బలమైన చెక్ అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

https://x.com/JaganannaCNCTS/status/1980552942563541257

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories