ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదాలతో రాజకీయాల్లో నిలదొక్కుకున్న వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఆయుధంగా ఎంచుకున్నది.. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం’.
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రజల్లో ఈ అంశంపై చర్చను రగిలించి, వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నర్సీపట్నంను వేదికగా చేసుకుని పోరాటానికి సన్నద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి విశాఖ జిల్లాలో వైసీపీ ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోవడంతో, అక్కడ తన పట్టు బలపరిచే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఈ సారి మెడికల్ కాలేజీలే ప్రధాన అజెండాగా ఆయన ప్రజల్లోకి రావడం విశేషం.
ఇక ప్రజల్లోకి రావడంలో ఆలస్యం చేసిన జగన్, ఈసారి నిజంగానే రోడ్డెక్కుతారని కూటమికి సెగలు పుట్టిస్తారని సమాచారం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం మెడికల్ కాలేజీల వివాదం జగన్ రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుంది.