Top Stories

జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం – వైసీపీలో కాంగ్రెస్ విలీనం?

జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపట్ల అనుబంధం చిన్ననాటి నుంచే ఉంది. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తూ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలిచారు. 2009లో కడప ఎంపీగా విజయం సాధించినా, 2010లో తండ్రి ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించడం ప్రారంభించారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కేసులు పెట్టించారు, చివరికి ఆయనను జైలుకు కూడా పంపించారు. ఈ అవమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులను తన వెంట తీసుకువచ్చారు. తన వెంటే వచ్చిన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, కొత్తదారి తొక్కించారు.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ విపరీత పరిస్థితుల్లో పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో మిగిలిపోయిన సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు.

ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి అనేక మంది నాయకులు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ విమర్శలు గుప్పించిన తులసి రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం, జగన్ తను పూర్తిగా మారిపోయినట్లు సంకేతాలిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ, ఇప్పుడు ఈ కథనం పూర్తిగా మారిపోయింది. జగన్ వైసీపీలోకి కాంగ్రెస్‌ను చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయనే ఉహాగానాలు నెలకొన్నాయి.

Trending today

దువ్వాడ ఆశలు గల్లంతు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్...

వైయస్ షర్మిలకు ‘చివరి ఛాన్స్’

జాతీయస్థాయిలో తిరిగి బలపడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో...

వల్లభనేని వంశీకి భారీ ఊరట..

వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక...

రే.. రే.. కొడకా.. నీ అంతు చూస్తా

అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

ఏబీఎన్ లో మరోసారి యాంకర్ వెంకటకృష్ణ బరెస్ట్

తెలుగు న్యూస్‌ చానళ్ల లైవ్‌ డిబేట్లు ఇటీవల వార్తలకన్నా వివాదాలకు వేదికలుగా...

Topics

దువ్వాడ ఆశలు గల్లంతు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్...

వైయస్ షర్మిలకు ‘చివరి ఛాన్స్’

జాతీయస్థాయిలో తిరిగి బలపడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో...

వల్లభనేని వంశీకి భారీ ఊరట..

వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక...

రే.. రే.. కొడకా.. నీ అంతు చూస్తా

అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

ఏబీఎన్ లో మరోసారి యాంకర్ వెంకటకృష్ణ బరెస్ట్

తెలుగు న్యూస్‌ చానళ్ల లైవ్‌ డిబేట్లు ఇటీవల వార్తలకన్నా వివాదాలకు వేదికలుగా...

ఏపీ ప్రజలకు ఎల్లో మీడియా శాపం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై పడుతున్న పన్నుల భారాన్ని సమర్థిస్తూ కూటమి ప్రభుత్వానికి వత్తాసు...

బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి...

ఏపీలో పదే పదే అదే తప్పు!

ఆంధ్రప్రదేశ్‌లో పాలన పక్కదారి పడుతోందన్న విమర్శలు రోజురోజుకీ బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు...

Related Articles

Popular Categories