Top Stories

జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం – వైసీపీలో కాంగ్రెస్ విలీనం?

జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపట్ల అనుబంధం చిన్ననాటి నుంచే ఉంది. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తూ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలిచారు. 2009లో కడప ఎంపీగా విజయం సాధించినా, 2010లో తండ్రి ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించడం ప్రారంభించారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కేసులు పెట్టించారు, చివరికి ఆయనను జైలుకు కూడా పంపించారు. ఈ అవమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులను తన వెంట తీసుకువచ్చారు. తన వెంటే వచ్చిన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, కొత్తదారి తొక్కించారు.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ విపరీత పరిస్థితుల్లో పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో మిగిలిపోయిన సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు.

ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి అనేక మంది నాయకులు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ విమర్శలు గుప్పించిన తులసి రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం, జగన్ తను పూర్తిగా మారిపోయినట్లు సంకేతాలిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ, ఇప్పుడు ఈ కథనం పూర్తిగా మారిపోయింది. జగన్ వైసీపీలోకి కాంగ్రెస్‌ను చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయనే ఉహాగానాలు నెలకొన్నాయి.

Trending today

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

Topics

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories