Top Stories

జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం – వైసీపీలో కాంగ్రెస్ విలీనం?

జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపట్ల అనుబంధం చిన్ననాటి నుంచే ఉంది. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తూ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలిచారు. 2009లో కడప ఎంపీగా విజయం సాధించినా, 2010లో తండ్రి ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించడం ప్రారంభించారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కేసులు పెట్టించారు, చివరికి ఆయనను జైలుకు కూడా పంపించారు. ఈ అవమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులను తన వెంట తీసుకువచ్చారు. తన వెంటే వచ్చిన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, కొత్తదారి తొక్కించారు.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ విపరీత పరిస్థితుల్లో పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో మిగిలిపోయిన సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు.

ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి అనేక మంది నాయకులు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ విమర్శలు గుప్పించిన తులసి రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం, జగన్ తను పూర్తిగా మారిపోయినట్లు సంకేతాలిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ, ఇప్పుడు ఈ కథనం పూర్తిగా మారిపోయింది. జగన్ వైసీపీలోకి కాంగ్రెస్‌ను చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయనే ఉహాగానాలు నెలకొన్నాయి.

Trending today

ఏపీలో పెరగనున్న నియోజకవర్గాలు.. ఎన్ని? ఎక్కడ ? అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి కేంద్ర ప్రభుత్వం...

మంత్రి కోమటిరెడ్డిని వెంటాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. చివరికి ఏమైందంటే?

కోనసీమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన...

మల్లారెడ్డి తోని అట్లుంటదీ మరీ.. వైరల్ వీడియో

వ్యాపార, విద్యారంగాల్లో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి, రాజకీయాల్లో సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతున్న మల్లారెడ్డిగారు...

బాబు అడ్డంగా బుక్కయ్యాడు.. వీడియో

ప్రపంచ చరిత్రలో ఇంతటి మోసగాడు మరొకరు ఉండరేమో! ఎన్నికల ముందు ప్రజలకు...

పవన్ ను అందుకే టార్గెట్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా...

Topics

ఏపీలో పెరగనున్న నియోజకవర్గాలు.. ఎన్ని? ఎక్కడ ? అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి కేంద్ర ప్రభుత్వం...

మంత్రి కోమటిరెడ్డిని వెంటాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. చివరికి ఏమైందంటే?

కోనసీమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన...

మల్లారెడ్డి తోని అట్లుంటదీ మరీ.. వైరల్ వీడియో

వ్యాపార, విద్యారంగాల్లో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి, రాజకీయాల్లో సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతున్న మల్లారెడ్డిగారు...

బాబు అడ్డంగా బుక్కయ్యాడు.. వీడియో

ప్రపంచ చరిత్రలో ఇంతటి మోసగాడు మరొకరు ఉండరేమో! ఎన్నికల ముందు ప్రజలకు...

పవన్ ను అందుకే టార్గెట్ చేశారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా...

పవన్ కళ్యాణ్ బర్తరఫ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై...

బాలయ్య హిందీ మాట్లాడితే… వీడియో మిస్ అవ్వొద్దు!

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి...

పవన్ కళ్యాణ్‌కు మళ్లీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహబూబ్‌నగర్...

Related Articles

Popular Categories