Top Stories

జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం – వైసీపీలో కాంగ్రెస్ విలీనం?

జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపట్ల అనుబంధం చిన్ననాటి నుంచే ఉంది. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తూ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలిచారు. 2009లో కడప ఎంపీగా విజయం సాధించినా, 2010లో తండ్రి ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించడం ప్రారంభించారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కేసులు పెట్టించారు, చివరికి ఆయనను జైలుకు కూడా పంపించారు. ఈ అవమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులను తన వెంట తీసుకువచ్చారు. తన వెంటే వచ్చిన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, కొత్తదారి తొక్కించారు.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ విపరీత పరిస్థితుల్లో పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో మిగిలిపోయిన సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు.

ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి అనేక మంది నాయకులు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ విమర్శలు గుప్పించిన తులసి రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం, జగన్ తను పూర్తిగా మారిపోయినట్లు సంకేతాలిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ, ఇప్పుడు ఈ కథనం పూర్తిగా మారిపోయింది. జగన్ వైసీపీలోకి కాంగ్రెస్‌ను చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయనే ఉహాగానాలు నెలకొన్నాయి.

Trending today

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం...

పెద్దదిక్కును కోల్పోయిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది....

పవన్ కల్యాణ్ ను రెచ్చగొడుతున్నారట

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన...

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు...

బాబు గారి స్త్రోత్రాలు.. విని తరించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అటల్‌ బిహారీ వాజ్‌పేయి...

Topics

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం...

పెద్దదిక్కును కోల్పోయిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది....

పవన్ కల్యాణ్ ను రెచ్చగొడుతున్నారట

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన...

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు...

బాబు గారి స్త్రోత్రాలు.. విని తరించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అటల్‌ బిహారీ వాజ్‌పేయి...

చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు? : టీవీ5 మూర్తి

రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనే పదం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో...

చంద్రబాబుపై మళ్లీ ఏబీఎన్ వెంకటకృష్ణ బరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం జరగడంపై...

RRR తరువాత ఏపీకి రానున్న మరో ఆస్కార్ అవార్డ్

గతంలో RRR సినిమాతో తెలుగు గడ్డకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి...

Related Articles

Popular Categories