ఇప్పుడు చెప్పు పవన్ కళ్యాణ్?

‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు’ అన్న సామెత ఊరికనే పుట్టలేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరును వైసీపీ నేతలు, నెటిజన్లు దీంతోనే సోషల్ మీడియాలో దెప్పిపొడుస్తున్నారు. ఎన్నికల ముందర పవన్ కళ్యాణ్ ఎన్నో చెప్పారు. తాను కుల, మతాలకు అతీతుడను అని.. భారతీయుడును అంటూ గొప్పలు చెప్పారు. నమ్మి జనాలు ఓట్లు వేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘సనాతన ధర్మం’ అంటూ పక్కా మతం రంగును పవన్ పూసుకున్నారు.

సామాజిక న్యాయం వైసీపీలో లేదని గొంతుచించుకున్న పెద్దమనిషి పవన్ ఇప్పుడు తన పార్టీలో ప్రభుత్వంలో పదవుల పంపకంలో ఎంత సామాజిక న్యాయం పాటించాడో తాజాగా అర్థమవుతోంది.

రాజ్యసభ సీటు కోసం పట్టుబట్టిన పవన్ కళ్యాణ్ కు అది చంద్రబాబు ఇవ్వలేదు. తన సోదరుడిని పార్లమెంట్ కు పంపాలన్న పవన్ కళ్యాణ్ ఆశ నెరవేరలేదు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవిని తీసుకొని తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయబోతున్నారు.

జనసేనకు 4 మంత్రి పదవులు చంద్రబాబు ఇస్తే అందులో మూడు పదవులు కాపు సామాజికవర్గానికే ఇచ్చిన పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం గురించి ఎన్నికల ముందర చేసిన వీడియోలను వైరల్ చేసి నిలదీస్తున్నారు. ‘అన్ని కులాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం, ప్రాతిపదికన ఇవ్వాలని.. ఒక్క కులంతోనే అన్ని పదవులను నింపొద్దు.. అన్ని ఒక్క కులానికే ఇవ్వడానికి జనసేన విరుద్దం’ అంటూ పవన్ గొప్పగా చెప్పాడు. ఇప్పుడా వీడియోలు బయటకు తీసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

వీడియో కోసం దీని మీద క్లిక్ చేయండి