కేఏ పాల్ ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన భార్య, పిల్లలు క్రైస్తవులు అని, తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మార్పును కేఏ పాల్ ఎండగట్టారు.
కే ఏ పాల్ మాట్లాడుతూ.. ‘మొన్నటివరకూ నా భార్య, పిల్లలు క్రైస్తువులు అన్నాడు. తాను బాప్టిజం కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ ఊగిపోతున్నాడు.. ఎద్దేవా చేస్తూ ’ కేఏ పాల్ ఎండగట్టాడు.
అదనంగా, కేఏ పాల్ పవన్ కళ్యాణ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏ పాల్ పవన్ కళ్యాణ్ను ‘ప్యాకేజి స్టార్’ అని కూడా విమర్శించారు. అదే విధంగా, తెలంగాణలో తీన్మార్ మల్లన్నను కూడా ప్యాకేజి స్టార్గా అభివర్ణించారు.
కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ పై ఊగిపోయిన లాస్ట్ వీడియో మాత్రం హైలెట్ గా నిలిచింది.. మీరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.