ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి కాపు నేతల్లో భరోసాను పెంచింది. మోసం చేసిన పవన్ పై వైసీపీ వైఖరి కరెక్టేనని అర్థమైంది.
గతంలో కాపు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఉన్నప్పటికీ, కాపుల ఆకాంక్షలకు పూర్తిస్థాయి నెరవేర్చారు. వారికోసం పోరాడారు.. ఆ లోటును పవన్ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడన్న భావన కాపుల్లో బలంగా ఉంది. ఆయన కాపు అనే గుర్తింపును బహిరంగంగా ముందుకు తేవకపోయినా చంద్రబాబుకు కాపు ఓటు బ్యాంకు తాకట్టు పెట్టాడని క్యాష్ చేసుకున్నాడన్న విమర్శలు వినిపించాయి.
2024 ఎన్నికల్లో పవన్ సూచించిన కూటమికి కాపుల మద్దతు నిర్ణయాత్మకంగా మారింది. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టాక కాపులకు తగిన ప్రాధాన్యత పదవులు గుర్తింపు లభించలేదన్నది వారిలో ఆందోళన.. ఇటీవల అంబటి రాంబాబు అరెస్టు సందర్భంలో కాపు నేతలకు వైసీపీ నుంచి ఫోన్లు వచ్చాయి.పవన్ పట్టించుకోకపోవడంతో వారంతా రాంబాబుకు మద్దతుగా పెద్ద ర్యాలీ తీశారు.
మొత్తానికి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా నిలిచే కాపు సామాజిక వర్గం ఇప్పటికీ పవన్ కు దూరంగా మారుతున్నారన్న వాస్తవం మరోసారి రుజువైంది.


