Top Stories

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

 

 

కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వీడియోలు, స్కిట్లు చేశారనే ఆరోపణలతో సీమరాజాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కిరాక్ ఆర్పీ, సీమరాజా కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుదారులు సీమరాజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సీమరాజాను హెచ్చరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక పోస్ట్‌లో “కేజీఎఫ్ సినిమాలో బలి ఇవ్వడానికి ఓ ముగ్గురిని వాళ్ళకి ఇష్టం అయిన తిండి పెట్టి విలన్ మేపుతుంటాడు.. మన సినిమాలో కర్రీ కాకి కిరణ్, సీమ రాజా, ఆర్పీ గాళ్ళు ఎంత వాగుతారో వాళ్ళ ఇష్టం. మన రోజున వాళ్ళ బలిని ఎవడు ఆపలేడు. ఏ దేశం పారిపోయిన లాక్కొచ్చి జైల్లో వేస్తారు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

మరో పోస్ట్‌లో “ఇంకా 4 ఏళ్ళ 1 నెల.. ఓర్చుకుందాం.. ఓపికతో ఉందాం.. జగన్ ఎప్పుడు పైన దేవుడు అనే వాడు అప్పుడు వీళ్ళని ఆ దేవుడు దగ్గరకే పంపిద్దాం’’ అంటూ సీమరాజాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

వైసీపీ శ్రేణుల నుండి వస్తున్న ఈ తరహా బెదిరింపులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ విమర్శలను ఆరోగ్యకరమైన రీతిలో స్వీకరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం తమ నాయకుడిని విమర్శించే వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై సీమరాజా లేదా కిరాక్ ఆర్పీ ఇంకా స్పందించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

 

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories