Top Stories

కొలికపూడి మళ్లీ కెలికాడు

 

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన గెలిచినప్పటి నుండి అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ఒక దశలో పార్టీ అధిష్టానం ఆయన విషయంలో కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ప్రచారం జరిగింది. ఇటీవల కొలికపూడి వ్యవహారం సద్దుమణిగినప్పటికీ, ఇప్పుడు మరో కలకలం రేగింది. ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఒక ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా, ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. కిషోర్ బదిలీ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ కిషోర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖను తమ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కిషోర్ గత నెలలోనే బదిలీ అయ్యారు. తిరువూరులోని తన అద్దె ఇంటిని కూడా ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం కిషోర్ మావయ్య ఆయన్ను కారులో ఆఫీసులో దింపారు. అయితే, మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.

కిషోర్ రాసిన సూసైడ్ నోట్‌గా భావిస్తున్న ఆ లేఖను చూసిన తోటి శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కిషోర్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేశారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజారా వద్ద సిగ్నల్ ట్రాక్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

శ్రీనివాసరావు పేరును ప్రస్తావించారు. “నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డిఈఈ ఉమా శంకర్, ఈఎన్సీ శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కారణం. బదిలీ జరిగినా రిలీవ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో గౌరవరం సెక్షన్‌కు బదిలీ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే బదిలీ ఆపి రాజకీయం చేశారు. నా బదిలీని అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారు. నేను దళిత ఉద్యోగిని. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావు పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కిషోర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గత కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వివాదాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా హెచ్చరించడంతోనే ఆయన జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే పేరు చెప్పి సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ జరగరానిది జరిగితే అది ఎమ్మెల్యే శ్రీనివాసరావు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు సైతం అదో ప్రచారాస్త్రంగా మారనుంది. బదిలీల్లో రాజకీయ సిఫార్సులు సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే, ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories