Top Stories

కొలికపూడి మళ్లీ కెలికాడు

 

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన గెలిచినప్పటి నుండి అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ఒక దశలో పార్టీ అధిష్టానం ఆయన విషయంలో కఠిన చర్యలకు సిద్ధమవుతోందని ప్రచారం జరిగింది. ఇటీవల కొలికపూడి వ్యవహారం సద్దుమణిగినప్పటికీ, ఇప్పుడు మరో కలకలం రేగింది. ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఒక ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా, ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. కిషోర్ బదిలీ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ కిషోర్ ఒక లేఖ రాశారు. ఆ లేఖను తమ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కిషోర్ గత నెలలోనే బదిలీ అయ్యారు. తిరువూరులోని తన అద్దె ఇంటిని కూడా ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం కిషోర్ మావయ్య ఆయన్ను కారులో ఆఫీసులో దింపారు. అయితే, మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.

కిషోర్ రాసిన సూసైడ్ నోట్‌గా భావిస్తున్న ఆ లేఖను చూసిన తోటి శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కిషోర్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేశారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజారా వద్ద సిగ్నల్ ట్రాక్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

శ్రీనివాసరావు పేరును ప్రస్తావించారు. “నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డిఈఈ ఉమా శంకర్, ఈఎన్సీ శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కారణం. బదిలీ జరిగినా రిలీవ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో గౌరవరం సెక్షన్‌కు బదిలీ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే బదిలీ ఆపి రాజకీయం చేశారు. నా బదిలీని అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారు. నేను దళిత ఉద్యోగిని. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావు పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కిషోర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గత కొంతకాలంగా తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వివాదాలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా హెచ్చరించడంతోనే ఆయన జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే పేరు చెప్పి సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ జరగరానిది జరిగితే అది ఎమ్మెల్యే శ్రీనివాసరావు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు సైతం అదో ప్రచారాస్త్రంగా మారనుంది. బదిలీల్లో రాజకీయ సిఫార్సులు సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే, ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories