Top Stories

గ్రేట్ ఆంధ్రా మూర్తి పై కంప్లైంట్.. షాకిచ్చిన మంచు లక్ష్మి

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వెబ్ మీడియా గ్రేట్ ఆంధ్రా జర్నలిస్ట్ వీ.ఎస్‌.ఎన్. మూర్తిపై ఆమె ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూలో తనను అడిగిన కొన్ని ప్రశ్నలు తన గౌరవాన్ని దెబ్బతీసాయని ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంచు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, జర్నలిస్ట్ మూర్తి తన వయసు, వేసుకునే దుస్తులపై ప్రశ్నలు అడిగారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. “అది జర్నలిస్టిక్ ఇంటర్వ్యూ కాదు, నేరుగా వ్యక్తిగత దాడి. ఇది గౌరవం తక్కువ చేసే ప్రయత్నం. కేవలం వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారు” అని ఆమె అన్నారు.

జర్నలిజం పట్ల తనకున్న గౌరవాన్ని గుర్తు చేసిన మంచు లక్ష్మి, “అన్ని మీడియా వ్యక్తుల పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఇలాంటి వ్యక్తిగత దాడులు సహించలేను. మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి నాకు ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఇలాంటి ప్రవర్తనను మౌనంగా వదిలేస్తే, ఇది మళ్లీ మళ్లీ జరుగుతుంది” అని వ్యాఖ్యానించారు.

తనపై జరిగిన ఈ ప్రవర్తనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్‌ను కోరుతూ ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా ఈ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు జర్నలిస్టులపై ఇలాంటి ఫిర్యాదులు చాలా అరుదుగా వెలువడిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

https://x.com/TeluguScribe/status/1969058746845503834

Trending today

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

Topics

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

Related Articles

Popular Categories