Top Stories

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO

 

తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మండల్ రెవెన్యూ అధికారి (MRO)కి తగిన శాస్తి జరిగింది. కొన్నేళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్న ఆ కామాంధుడు, గురువారం మరింత బరితెగించి ఆమె ఇంటికే వెళ్ళి దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించడంతో బాధితురాలి తల్లి అతడిని చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే, నాయుడుపేటలో విధులు నిర్వహిస్తున్న MRO, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా VROను కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. “మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?” అంటూ అసభ్యకర మెసేజ్‌లు పంపేవాడు. బాధితురాలు ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నప్పటికీ, గురువారం ఆ MRO ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుస్తులు విప్పి, తన కోరిక తీర్చాలంటూ VROను బలవంతం చేశాడు.

దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన బాధితురాలు వెంటనే తన తల్లికి సమాచారం ఇచ్చింది. కూతురు పడుతున్న బాధను తెలుసుకున్న తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి చేరుకుంది. ఇంట్లో MRO అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే కర్ర తీసుకుని ఆ కామాంధుడిని చితకబాదింది. తల్లి ఆగ్రహం ముందు MRO ఏమీ చేయలేకపోయాడు. ఈ దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి నీచమైన అధికారులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం సస్పెండ్ చేయడంతో సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కరువవుతోందని, ఉన్నతాధికారులు ఇలాగే ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి తల్లి చూపిన తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.

https://x.com/greatandhranews/status/1950848731097747935

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories