Top Stories

డిప్యూటీ సీఎంనే బెదిరించిన నారా లోకేష్

బెంగళూరుకు చెందిన బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేష్ యాబాజీ, తమ నగరంలోని రోడ్ల దుస్థితిపై ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. రాజేష్ యాబాజీ తన ట్వీట్‌లో, బెంగళూరులో గంటన్నర ప్రయాణ సమయం, రోడ్లపై గుంతలు, దుమ్ము కారణంగా తమ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల తాము వేరే ప్రాంతానికి వెళ్లాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ట్వీట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, రాజేష్ యాబాజీని తమ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలని ఆహ్వానించారు. విశాఖపట్నం దేశంలోనే పరిశుభ్రమైన నగరాలలో ఒకటని, మంచి మౌలిక సదుపాయాలు, మహిళలకు భద్రత ఉన్న నగరమని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ రకమైన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లకు తమ ప్రభుత్వం లొంగదని, బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల కోసం ఇప్పటికే రూ.1100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నవంబర్ నాటికి రోడ్ల మరమ్మత్తులను పూర్తిచేయడానికి గడువు విధించామని కూడా ఆయన వివరించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏకంగా బెదిరించేశారు.  “మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న తేడా అదే. మా ప్రజల నిజమైన సమస్యలను బ్లాక్ మెయిల్ గా కొట్టిపారేయలేం. వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం,” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ కొత్త రాజకీయ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://x.com/naralokesh/status/1968643373025182078

Trending today

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Topics

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Related Articles

Popular Categories