Top Stories

వచ్చేసారి అధికారం వైసీపీదే.. ఇదే సాక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. ఇది ఆయనకు మూడో విజయమైంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన పాకల రఘువర్మపై ఆయన గెలిచారు. గత ఎన్నికల్లో రఘువర్మ గాదె శ్రీనివాసులు నాయుడుపై విజయం సాధించినప్పటికీ, ఈసారి ఆయన చేతిలోనే ఓటమి చెందడం విశేషం.

గాదె శ్రీనివాసులు నాయుడు విజయనగరం జిల్లాకు చెందినవారు. రఘువర్మ కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఉపాధ్యాయ వృత్తిలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా చేరిన ఆయన, ఉపాధ్యాయ సంఘాల్లో చురుకుగా వ్యవహరించారు. పిఆర్టియు సభ్యుడిగా చేరిన తరువాత, జిల్లా స్థాయిలో నాయకుడిగా ఎదిగి రాష్ట్ర కార్యవర్గంలో కూడా బాధ్యతలు నిర్వహించారు.

2007లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శాసనమండలి విస్తరణ జరిగింది. అదే సంవత్సరం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పిఆర్టియు అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రప్పడును ఓడించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2013లో కూడా అదే అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే, 2019లో పాకలపాటి రఘువర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం మళ్లీ రఘువర్మపై గెలిచి తన బలాన్ని చాటుకున్నారు.

గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు టీడీపీ కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే, కూటమి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. టీడీపీ నేతలు రఘువర్మ గెలుపుకోసం ప్రచారం చేశారు. అయినప్పటికీ, ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయుల మద్దతు గాదె శ్రీనివాసులు నాయుడుకే లభించడంతో ఆయన విజయం సాధించారు.

తాను మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు.

 

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories