ఏపీలో పొలిటికల్ తుఫాన్ రాబోతోందట.. వచ్చే ఆరు నెలల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయట.. అవును నిజంగా నిజమని ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు జడ శ్రవణ్ బాంబు పేల్చారు.
ఏపీలో శాంతి భద్రతల లోపాలు.. హిందూ దేవాలయాల్లో అపచారాలు చోటు చేసుకుండడంపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారట.. చంద్రబాబు పాలనలో ఫెయిల్ అవుతున్నారని గుర్రుగా ఉన్నారట.. పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల పాప పరిరక్షణ దీక్షలు.. సనాతన ధర్మం పేరిట నిరసనలు తెలిపారు. హిందుత్వాన్ని ఓన్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే హొంమంత్రి అనిత వైఫల్యాన్ని పవన్ ఇటీవల ఎత్తి చూపారు. తాజాగా తమ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. చంద్రబాబు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రెస్ మీట్లలోనూ వాపోతున్నారు.
ఇక చంద్రబాబు కూడా తన కొడుకు లోకేష్ ను వచ్చే ఆరు నెలల్లోనే సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు దిగిపోయి లోకేష్ సీఎం అయితే పవన్ ఒప్పుకోరని.. ఆయన ప్రభుత్వంలో కొనసాగరని సమాచారం. దీంతో ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యేలను విడదీస్తారని.. మరో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ తరహా రాజకీయం నడిపి బీజేపీ ప్రోద్బలంతో ఏపీలో పవన్ సీఎం అవుతారని జడ శ్రవణ్ బాంబు పేల్చారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చంద్రబాబు కు పవన్ వెన్నుపోటు పొడిచి కట్టప్ప అవుతారని జడ శ్రవణ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.