Top Stories

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని బాధితురాలు ప్రీతి తల్లి పార్వతి దేవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

“న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతా” అని హెచ్చరించిన ఆమె, గిరిజనుల ఓట్లపై పవన్ కళ్యాణ్ చూపిన శ్రద్ధ.. వారి సమస్యలపై ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై జరిగిన అన్యాయంపై ఉద్యమం చేస్తామని కూడా ప్రకటించారు.

2017లో కర్నూలులోని రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాఠశాల యజమాని కుమారులపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినా, నిందితులు కేవలం 23 రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది.

పవన్ కళ్యాణ్ సాక్షాత్కారంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసుపై చేస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి ఆందోళనకు దిగుతున్న పరిణామం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories