Top Stories

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి తోటల ప‌రిశీల‌న సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ‌లోని కొబ్బరి చెట్ల మృతికి గ‌ల కారణాలపై ఆయ‌న చేసిన సంచ‌ల‌న కామెంట్ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కొన్ని నెల‌లుగా డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పరిధిలో వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. సముద్రపు నీరు వెనక్కి రావ‌డం , మురుగు కాల్వల్లోని నీటిలో లవణాల శాతం పెరగడం వల్ల ఈ నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్… అక్కడి పచ్చదనాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

“కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది. రాష్ట్రం విడిపోవ‌డానికి కార‌ణం గోదావ‌రి జిల్లాల ప‌చ్చ‌ద‌నమే.. ఆ శాపం త‌గిలేసిన‌ట్టుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉన్న వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని కొంతమంది నాయకులు, నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొబ్బరి చెట్ల నాశనానికి సాంకేతిక, భౌగోళిక కారణాలుంటే, వాటిని రాజకీయం చేస్తూ ‘దిష్టి’ వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలుకుతున్నారు.

https://x.com/_Ysrkutumbam/status/1993584586048328088?s=20

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories