Top Stories

తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల ‘దిష్టి’ తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవన్‌పై మాటల దాడికి దిగారు.

కోనసీమలో ఎండిపోయిన కొబ్బరి తోటలను పరిశీలించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్‌పై ఇప్పటికే ఘాటుగా విమర్శలు చేశారు.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరింత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ‘సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో’ అని దుమ్మెత్తిపోశారు.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతాం. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతాం.” అని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి శాస్త్రీయ కారణాల బదులు ‘దిష్టి’ వంటి అంశాలను ప్రస్తావించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాపారాలు, నివాసం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, మా దిష్టి ఉంటే ఆయన ఇక్కడ ఉండగలుగుతారా అని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా, లేదా వివాదం మరింత ముదురుతుందా అనేది చూడాలి.

https://x.com/TeluguScribe/status/1995535805507674422?s=20

https://x.com/2029YSJ/status/1995669898937467109?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories