ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా.. టాలీవుడ్ హీరోలు అందరూ నా వాళ్లేనని.. అందరి హీరోల ఫ్యాన్స్ నాకే ఓటు వేయాలని.. ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరో అని.. మహేష్ బాబు గొప్ప నటుడు అంటూ అందరినీ కీర్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం వారందరినీ మరిచిపోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఔను నిజంగా నిజం ఇదీ.. ప్రతిపక్షంలో ఉండగా.. బాలకృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకూ అందరూ హీరోలను స్తుతిస్తూ.. కీర్తిస్తూ వారి ఓట్ల కోసం అర్రులు చాచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక నిన్నటి గేమ్ చేంజర్ సభలో టాలీవుడ్ హీరో ల పేర్లు మరిచిపోవడంపై ట్రోల్స్ పడుతున్నాయి..
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు మరిచిపోని హీరోల పేర్లు ఇప్పుడు పవన్ ఎలా మరిచిపోతారని.. ఎవరో గుర్తు చేస్తే హీరోలు గుర్తుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కు అధికార దర్పం బాగా తలకెక్కిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఓట్లు అడుక్కున్నప్పుడు హీరోలు కావాలి.. అధికారం వచ్చాక హీరోల పేర్లు గుర్తు లేవా? అంటూ పాత వీడియోలు కొత్త వీడియోలు తీసి ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పుడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.