Top Stories

యోగాలో పవన్ మెలికలు

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతా యోగా ఆసనాలు వేస్తూ ప్రశాంతంగా దృఢమైన స్థితిలో ఉండగా, పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని ఆసనాల్లో సరిగా స్థిరంగా నిలబడలేకపోయారు.

ఆయన కూర్చున్న స్థితిలో కూడా శరీరం ముందుకు, వెనుకకు ఒయ్యారంగా ఊగిపోయింది. మధ్యలో మెలికలు తిరిగి అసంతులితంగా కదలడం కనిపించింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న మీడియా కెమెరాల్లో కూడా బంధించడంతో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“పవన్ కళ్యాణ్‌కి శరీరం సహకరించలేదా?” అనే ప్రశ్నలు నెటిజన్ల నోళ్లలో వినిపిస్తున్నాయి. కొంతమంది పవన్ అనారోగ్యం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడితే… మరికొంతమంది “ఇదేనా హీరో శరీర ధైర్యం?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా ఎన్నికల ఒత్తిడి, ఆందోళనలు కారణంగా పవన్ శరీరం అలసిపోయి ఉండొచ్చని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే యోగాలో ఇంత అస్థిరత ఎందుకన్నది మాత్రం అధికారికంగా ఎవ్వరూ స్పందించలేదు.

ఎలా ఉన్నా యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తన మరింత చర్చనీయాంశంగా మారింది. యోగా చేసే సమయంలో శరీరం, మనస్సు పూర్తిగా స్థిరంగా ఉండాలని ఉపదేశించే కార్యక్రమంలో పవన్‌కి ఇలా అవడం కొంత ఆశ్చర్యకరంగానే మిగిలింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానులు మాత్రం “మన నాయకుడు అలసిపోయారు, విశ్రాంతి అవసరం” అంటూ తమ స్థాయిలో సమర్ధించుకుంటున్నారు.

మొత్తానికి ఈ యోగ కార్యక్రమంలో పవన్ మెలికలు… కొత్త చర్చలకు దారి తీశాయన్నది మాత్రం నిజం!

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/PublicMike_/status/1936322843010384086

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories