చంద్రబాబు ముంచేశారు. అవును నిజంగానే ముంచేశాడు. ఒకప్పుడు 1996వ దశకంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు’ అని ఇదే చంద్రబాబు సీఎంగా పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు.. ఒక్కరినే సంతానంగా కని ఆదర్శంగా నిలిచారు.. అయితే 2023 ఎన్నికల సందర్భంగా ఏపీలో జనాభా పడిపోతోందని.. ఎవ్వరూ పిల్లలను కనడం లేదని.. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చాడు.
ముగ్గురు నలుగురు పిల్లలను అయినా కనండి.. ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు రూ.15వేలు చొప్పున ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ఇదే బాబు గారు సగర్వంగా ప్రకటించారు.
ఇప్పుడు బాబు గారు ఈ అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చారు. గెలిచి సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ చేతులెత్తేశారు. ‘చూస్తే భయమేస్తోంది.. డబ్బులు లేవు. సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం’ అంటూ బాబు గారు జనాల చెవుల్లో పూలు పెట్టేశారు.
సంపద సృష్టిస్తానని.. తాను విజనరీ అని ఫోజులు కొట్టిన బాబు గారు ఇప్పుడు మోసం చేశారని.. పిల్లలను కంటే రూ.15వేలు ఇస్తానన్న బాబు హామీ ఏమైందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.
వీడియో కోసం దీనిమీద క్లిక్ చేయండి