ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తిగత ప్రయాణాల ఖర్చులపై తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం వారికి ఉందా అంటూ సవాలు విసిరారు. ప్రస్తుతం ఈ సవాలుకు సంబంధించిన వీడియో రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పేర్ని నాని ప్రధానంగా ఇద్దరు నాయకులపై దృష్టి సారించి వారి ప్రయాణాలకు అవుతున్న భారీ ఖర్చుల మూలాన్ని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుండి విజయవాడకు వ్యక్తిగత విమానంలో వచ్చి, సోమవారం తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ ఒక్క రానుపోను వ్యక్తిగత విమాన ప్రయాణం ఖర్చు అక్షరాలా రూ. 20 లక్షలుగా ఉంటుందని ఆయన ఆరోపించారు.
ఇక నారా లోకేష్ తన పర్యటనలకు తరచుగా హెలికాప్టర్లు మరియు విమానాలను వాడుతున్నారని, వీటి ఖర్చు కోట్లలో ఉంటుందని నాని పేర్కొన్నారు.
ప్రజల సొమ్ము కాదంటే, ఈ భారీ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయో స్పష్టం చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ ఖర్చులు ప్రభుత్వ సొమ్ము కాకుండా మీ వ్యక్తిగత జేబుల్లోంచి కడుతున్నారా? ఒకవేళ జేబుల్లోంచి కడుతున్నట్లయితే, ఆ డబ్బు ఎవరిది? ఎవరైనా బినామీలు ఈ ఖర్చులను భరిస్తున్నారా? లేక టీడీపీకి సంబంధించిన హెరిటేజ్ సంస్థ నుంచి ఈ నిధులు వెళ్తున్నాయా?
“ప్రభుత్వ ప్రజల సొమ్ముతో కాకుండా మీరు తిరిగే విమాన ప్రయాణాల ఖర్చు ఎక్కడిదో చెప్పాలి,” అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు సమాధానం చెప్పే దమ్ముందా? అని ఆయన సవాలు విసిరారు.
https://x.com/JaganannaCNCTS/status/1995863868376318411?s=20


