Top Stories

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలాకాలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

పిఠాపురం పరిధిలోని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నడుస్తోందని స్థానికులు వెల్లడించారు. ఆవుల కొవ్వును ఉపయోగించి నెయ్యిలా కనిపించే పదార్థాన్ని తయారు చేసి, మార్కెట్లో “శుద్ధ నెయ్యి” పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ ఘటనపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

ఈ కల్తీ నెయ్యి వ్యాపారం వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల మద్దతుతోనే ఈ నకిలీ వ్యాపారం ఇంత బలంగా కొనసాగుతోందని ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ప్రతి రోజూ వాడే ఆహార పదార్థాల్లో ఇలా కల్తీ నెయ్యి చేరడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది.

https://x.com/greatandhranews/status/1986315808679805205

Trending today

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

Topics

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

Related Articles

Popular Categories