రాజస్థానీ కిరణ్ రాయల్.. తిరుపతిలో ఎలా ఎదిగాడు? కిరణ్ రాయల్ చరిత్ర

రాజకీయాల్లో ఎదగాలంటే కేవలం ప్రజాసేవ మాత్రమే కాదు, అనేక వ్యూహాలు అవసరం అవుతాయి. కొంత మంది రాజకీయ నాయకులు తమ సామాజిక, కుల పరమైన గుర్తింపులను మార్చుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తుల్లో కిరణ్ రాయల్ ఒకరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కిరణ్ రాయల్ అసలు పేరుతో పాటు వారి కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారం ప్రకారం, కిరణ్ తండ్రి రాజస్థాన్‌కి చెందిన మార్వాడి వ్యాపారి. తిరుపతిలో చిన్న తరహా వ్యాపారాలు నిర్వహించేవాడు. తిరుపతిలో బలమైన సామాజికవర్గమైన ఒక బలిజ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న తర్వాత, కుటుంబం కులగుర్తింపును కిరణ్ రాయల్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని మార్చుకుని, స్థానికంగా ప్రజాదరణ పొందేలా ఓ కొత్త కథనాన్ని రూపొందించుకున్నారని విమర్శకులు అంటున్నారు. కులభేదాలను రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగించుకోవడం కొత్త విషయం కాదు. అయితే, ఓ వ్యక్తి తన అసలైన కుటుంబ నేపథ్యాన్ని మారుస్తూ, ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించడం పై ప్రజలు కిరణ్ రాయల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయవచ్చనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలు నిజమైన సామాజిక సేవకులను గమనించి, కేవలం లబ్ధిపొందేందుకు వ్యూహాలు వేసే వారికి వ్యతిరేకంగా గమనించాల్సిన అవసరం ఉంది.

ఇక కిరణ్ రాయల్ ముందుగా రేణుకను చేసుకొని ఆమెను వదిలేసి తర్వాత లక్ష్మీ అనే మహిళతో సహజీవనం చేశాడు. ఆమె నుంచి 1.20 కోట్లు తీసుకొని.. 25 సవర్ల బంగారం తీసుకొని మోసం చేయడంతో ఆమె విలేకరుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ ఆరోపణలపై కిరణ్ రాయల్ ఇంకా స్పందించలేదు. అయితే, రాజకీయాల్లో ఇలాంటి వివాదాలు కొత్తకావు. ప్రజలు నిజమైన నాయకత్వాన్ని గుర్తించి, వ్యూహాత్మక మార్పులను అర్థం చేసుకోవాలి.