సంపద సృష్టి అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ సూపర్ 6 ను పక్కనపడేశారు. నీకు రూ.15వేలు .. నీకు 18వేలు ఇద్దామంటే పైసల్లేవు అంటూ అసెంబ్లీ వేదికగా నిట్టూర్చారు.. అదేంటి సంపద సృష్టిస్తా.. ప్రజలకు పంచుతాను అని హామీనిచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకిలా చేతులెత్తేసాడని ప్రజలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇక తాజాగా రాష్ట్ర రహదారుల గుంతలను బాగు చేయాలంటే తమ వద్ద డబ్బు లేదని.. అందుకే అన్ని రహదారులపై టోల్ గేట్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రహదారులను వేయిస్తానంటూ చంద్రబాబు ప్రకటనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కుర్చీ ఎక్కడానికి చేసిన ఖర్చును రాబట్టడానికి ఇంతకంటే సంపద సృష్టి లేదా బాబూ అంటూ విమర్శిస్తున్నారు.
ఇక పీఏసీ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలని చంద్రబాబును వైసీపీ కోరుతోంది. అయితే రాజ్యాంగంలో రాసున్నా తన రాజ్యాంగం రూల్స్ పాటించనంటూ చంద్రబాబు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. పీఏసీ పదవి ఇస్తే తన ప్రభుత్వ లెక్కలు, బొక్కలు అన్ని బయటపెట్టి బుక్కుల్లో ఎక్కించి ఏకిపారేస్తారని బాబు గారు పీఏసీ పదవి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
నేను ఒక్కో యూనిట్ కరెంట్ 6 రూపాయలకు కొన్నా తన మీడియాతో రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మేనేజ్ చేస్తానని.. అదే జగన్ 2.50కే కరెంట్ కొన్నా దోచేశాడని మీడియాతో ప్రచారం చేయిస్తారని వైసీపీ నేతలు, ట్రోల్స్ దెప్పిపొడుస్తున్నారు. ఇప్పుడీ గోదావరి యువకుడు మాట్లాడిన యాస డైలాగులు బాగా పేలుతున్నాయి. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.