Top Stories

కొమ్మినేని అరెస్ట్!

అమరావతి మహిళా రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో ఏపీ పోలీసులు కఠినంగా స్పందించారు. ఈ వివాదంలో భాగంగా మీడియా విశ్లేషకుడు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన “అమరావతిలో వేశ్యలు ఉన్నారు” అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘాటుగా స్పందించారు. సాక్షి యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని వ్యవస్థీకృత కుట్రగా అభివర్ణించారు.

అరెస్టుల ప్రక్రియ ప్రారంభం
ఈ ఉదంతంతో కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన కూడా త్వరలోనే అరెస్టయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సాక్షి మీడియా నిశ్శబ్దం
ఈ వివాదంపై ఇప్పటివరకు సాక్షి మీడియా నుంచి స్పందన రాలేదు. మీడియా యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే జర్నలిస్టు కృష్ణంరాజు మాత్రం స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలు తప్పుడు దిశలో వివరణ చెబుతూ అమరావతి కాకుండా ఆ ప్రాంత పరిసరాల గురించి మాత్రమే చెప్పానని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందిస్తూ వీరి వ్యక్తిగత వ్యాఖ్యలకు తమ పార్టీకి, సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.

జర్నలిస్టు సంఘాలు మౌనం
కొమ్మినేని అరెస్ట్‌పై ఇంకా జర్నలిస్టు సంఘాల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

కొమ్మినేనికి సుదీర్ఘ అనుభవం
కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగు మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం కలవారు. ఈనాడు, ఇతర ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఇటీవల కాలంలో సాక్షి ఛానల్‌లో యాంకర్‌గా, విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు చాలాసార్లు వినిపించాయి. తాజాగా అమరావతి అంశంలో చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఆగ్రహానికి దారి తీశాయని విశ్లేషణలు ఉన్నాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories