Top Stories

బాబు పాలనకు విసిగి ఐపీఎస్ గుడ్ బై

రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ అవమానాల మధ్య చివరికి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి గుడ్‌బై చెప్పారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పని చేస్తున్న ఆయన, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ (VRS) కోసం ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసినట్లు పోలీసు శాఖ వర్గాలు వెల్లడించాయి.

గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సిద్ధార్థ్… ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ‘రెడ్ బుక్’ వేధింపుల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసిన ఆయన గత నెల నుంచి విధులకు కూడా హాజరు కావడం లేదు.

పోలీసు వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిన ఈ పరిణామం రాజకీయ దుమారానికి దారితీసే అవకాశముంది. ఇప్పటివరకు 24 మంది ఐపీఎస్ అధికారులను విధుల్లోకి తీసుకోకుండా వేయిటింగ్‌లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం, పలువురు సీనియర్ అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇచ్చిన తీరు విమర్శలకు దారితీస్తోంది.

ఈ క్రమంలోనే ఐజీ వినీత్ బ్రిజాలాల్ కేంద్ర సేవలకెళ్లడం, పీఎస్ఆర్ అంజనేయులు, పీవీ సునీల్ కుమార్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీ వంటి అధికారులపై సస్పెన్షన్‌లు, కేసులు నమోదవ్వడం పోలీసు శాఖలో అశాంతి వాతావరణాన్ని తెచ్చినట్లు వర్గీయులు చెబుతున్నారు.

సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఆయన ఢిల్లీలోని ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో చేరనున్నారని సమాచారం. ప్రస్తుతం పోలీస్ శాఖలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడటానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్మకంగా చెబుతున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories