Top Stories

సింగపూర్ సిత్రాలు

 

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అభివృద్ధి దిశగా, పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో వెళ్లిన ఈ పర్యటనపై నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అక్కడి సింగపూర్ అధికారులతో సమావేశాలు, పార్టీ నాయకులతో తీసిన ఫోటోలు, కోలాటాలు, స్వాగతాల హడావుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన తీరు ట్రోల్స్‌కు దారితీసింది.

చంద్రబాబు టూర్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల టీడీపీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారితో కలిసి సింగపూర్ వీధుల్లో కోలాటం, పర్ఫార్మెన్స్‌లు నిర్వహించడం, అక్కడి ప్రవాసాంధ్రుల నుంచి జయజయకారాలు పొందడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దీని వెనుక వ్యాపార ప్రణాళికలంటే ఏమి లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పష్టమైన పెట్టుబడి ఒప్పందాలు లేకపోవడం, ప్రభుత్వం తరపున ఎలాంటి కార్యచరణ ప్లాన్ వివరాలు రానివ్వడం నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది. “చంద్రబాబు టూర్ కాకుండా టిడిపి నాయకుల కుటుంబ పర్యటనలా ఉంది” అంటూ సెటైర్లు పేలుతున్నాయి. “పారిశ్రామికవేత్తలతో కాకుండా, పార్టీ నాయకులతోనే ఎక్కువ టైం గడిపారు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ వైరల్ అవుతోంది.

నిజానికి, చంద్రబాబు సింగపూర్ పర్యటనను చాలా ప్రాధాన్యంగా ప్రకటించారు. కానీ పర్యటన అనంతరం విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం, సింగపూర్ ప్రభుత్వం లేదా ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలేవీ కుదరలేదు. “విజన్ గొప్పది, కానీ అమలు మాత్రం దారుణం” అంటూ ఒకరు స్పందించారు.

చంద్రబాబు టూర్ అంటే భారీ పెట్టుబడుల ప్రకటనలు, నిర్మాణ ప్రణాళికలు, డిజిటల్ మోడల్స్ గల అభివృద్ధి దృక్పథం ఉండాలని ప్రజలు ఆశించారు 98toto. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ప్రత్యక్ష లాభాలు లేకుండానే భారీగా ఖర్చు చేసిన ఈ పర్యటనపై ప్రశ్నలు లేవనెత్తడం సహజం. సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లు ఈ టూర్ ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

https://x.com/GraduateAdda/status/1950518393066680408

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories