ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సీజన్లో కొన్ని కేసులు, కొన్ని సమస్యలు బిగ్ ఇష్యూలుగా మారుతాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసు అలాంటి ఒక అంశంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసుపై బట్టలు చింపుకొని, మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మేము అధికారంలోకి వస్తే ఇదే మా మొదటి కేసు… దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వ్ చేస్తాం” అని గట్టిగా చెప్పిన విషయం అందరికీ గుర్తుంది.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనసేన – టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ సుగాలి ప్రీతి కేసు మాత్రం ఇప్పటికీ దుమ్ము పట్టేలా ఉంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత సుగాలి ప్రీతి తల్లి స్వయంగా పవన్ను కలిసినా, “మేము దీని మీద పని చేస్తున్నాం” అన్న జవాబు తప్ప కొత్తగా ఏ చర్యా కనిపించలేదు.
ఇప్పటికి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఈ కేసులో ఎలాంటి స్పష్టమైన దర్యాప్తు ముందుకు సాగలేదు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా నిరాశతోనే ఉంది.
ఇక నెటిజన్లు మాత్రం పవన్ పాత వీడియోలు, హామీలను బయటకు తీస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు విసురుతున్నారు. “అప్పుడు హాట్ టాపిక్గా వాడుకొని మైలేజ్ సంపాదించారు, ఇప్పుడు అధికారంలో ఉన్నా న్యాయం మాత్రం కనిపించడం లేదు” అని విమర్శలు గుప్పిస్తున్నారు.
సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఒకప్పుడు ఆయుధమైంది. కానీ ఇప్పుడు అదే ఆయుధం ఆయనను ఇబ్బందుల్లో పడేస్తోంది. న్యాయం జరగకపోతే ప్రజల విశ్వాసం క్రమంగా దెబ్బతింటుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
https://x.com/Shivreddy_ysrcp/status/1957090419659165795