Top Stories

జగన్ ను శరణు కోరిన ‘ఎన్డీఏ’

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారుకు ఆదిలోనే చెక్ పడింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు ఎంపీల పదవీ కాలం ముగిసింది. ఇందులో నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, మహేశ్ జెఠ్మాలనీ, రామ్ షకిల్, సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. శనివారం వీరి పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు చేరింది. మొత్తంగా 245 సభ్యులున్న రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే మొత్తంగా ఎన్డీఏ కూలమి బలం ప్రస్తుతం 101కి చేరింది.

ఇండియా కూటమి బలం ఎంతంటే..

రాజ్యసభలో ఇండియా కూటమికి 87 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అయితే ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమిలో లేని సభ్యులు ఇప్పుడు కీలక బిల్లుల పాస్ లో కీలకం కాబోతున్నారు. వీరిపై ఇప్పుడు రెండు కూటములు దృష్టి పెట్టాయి. ఎన్డీయేతర పార్టీలపై ఇప్పుడు మోదీ సర్కారు దృష్టి పడింది. ఇందులో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 20 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు..

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది. ఈ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీసీ మద్దతు చాలా అవసరం. ఇక అన్నాడీఎంకే కు నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారబోతున్నది. మరోవైపు ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్న బీజేడీ ఎన్డీఏకు ఇక తమ మద్దతు ఉండబోదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో వైఎస్సార్సీపీ ఎన్డీఏకు సంపూర్ణంగా సహకరించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందా.. లేదా అనేది కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరమవుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆ కూటమికి మద్దతునిస్తారా అనేది కీలకం కాబోతున్నది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మాజీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనను ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. అయితే వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేస్తారా.. ప్రస్తుతానికి మద్దతునిస్తారా అనేది త్వరలోనే నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Trending today

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

నా మీద ఇలా చేసిన వాళ్ల నాశనం కళ్లారా చూసాకే నేను చస్తాను

జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన కమెడియన్ చలాకి చంటి ఇటీవల...

కూటమి అపచారం.. వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు...

Topics

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

నా మీద ఇలా చేసిన వాళ్ల నాశనం కళ్లారా చూసాకే నేను చస్తాను

జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన కమెడియన్ చలాకి చంటి ఇటీవల...

కూటమి అపచారం.. వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు...

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

Related Articles

Popular Categories