Top Stories

జగన్ ను శరణు కోరిన ‘ఎన్డీఏ’

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారుకు ఆదిలోనే చెక్ పడింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు ఎంపీల పదవీ కాలం ముగిసింది. ఇందులో నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, మహేశ్ జెఠ్మాలనీ, రామ్ షకిల్, సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. శనివారం వీరి పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు చేరింది. మొత్తంగా 245 సభ్యులున్న రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే మొత్తంగా ఎన్డీఏ కూలమి బలం ప్రస్తుతం 101కి చేరింది.

ఇండియా కూటమి బలం ఎంతంటే..

రాజ్యసభలో ఇండియా కూటమికి 87 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అయితే ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమిలో లేని సభ్యులు ఇప్పుడు కీలక బిల్లుల పాస్ లో కీలకం కాబోతున్నారు. వీరిపై ఇప్పుడు రెండు కూటములు దృష్టి పెట్టాయి. ఎన్డీయేతర పార్టీలపై ఇప్పుడు మోదీ సర్కారు దృష్టి పడింది. ఇందులో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 20 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు..

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది. ఈ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీసీ మద్దతు చాలా అవసరం. ఇక అన్నాడీఎంకే కు నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారబోతున్నది. మరోవైపు ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్న బీజేడీ ఎన్డీఏకు ఇక తమ మద్దతు ఉండబోదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో వైఎస్సార్సీపీ ఎన్డీఏకు సంపూర్ణంగా సహకరించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందా.. లేదా అనేది కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరమవుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆ కూటమికి మద్దతునిస్తారా అనేది కీలకం కాబోతున్నది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మాజీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనను ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. అయితే వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేస్తారా.. ప్రస్తుతానికి మద్దతునిస్తారా అనేది త్వరలోనే నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Trending today

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

మెడికల్ కాలేజీల టెండర్లు.. ప్రభుత్వ పరువుపాయే

ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న...

మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

వాళ్లను వెంటాడుతున్న జగన్ భయం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం...

బంగారం కొనడాన్ని ఇక మరిచిపోండి

బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ వారం...

Topics

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

మెడికల్ కాలేజీల టెండర్లు.. ప్రభుత్వ పరువుపాయే

ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న...

మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

వాళ్లను వెంటాడుతున్న జగన్ భయం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం...

బంగారం కొనడాన్ని ఇక మరిచిపోండి

బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ వారం...

చంద్రబాబు-రేవంత్ పై ‘కేసీఆర్’ మార్క్ రాజకీయం

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై చాలాకాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు...

ఐఏఎస్ అధికారులను బూతులు తిట్టిన టీడీపీ నేత

తెలుగుదేశం పార్టీ నేత దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో...

వైఎస్ఆర్, జగన్.. వీడియో గూస్ బాంబ్స్

రాజకీయాల్లో వారసులు రావడం సహజం, కానీ ఆ వారసత్వాన్ని ప్రజల గుండెల్లో...

Related Articles

Popular Categories