Top Stories

జగన్ ను శరణు కోరిన ‘ఎన్డీఏ’

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారుకు ఆదిలోనే చెక్ పడింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు ఎంపీల పదవీ కాలం ముగిసింది. ఇందులో నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, మహేశ్ జెఠ్మాలనీ, రామ్ షకిల్, సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. శనివారం వీరి పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు చేరింది. మొత్తంగా 245 సభ్యులున్న రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే మొత్తంగా ఎన్డీఏ కూలమి బలం ప్రస్తుతం 101కి చేరింది.

ఇండియా కూటమి బలం ఎంతంటే..

రాజ్యసభలో ఇండియా కూటమికి 87 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అయితే ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమిలో లేని సభ్యులు ఇప్పుడు కీలక బిల్లుల పాస్ లో కీలకం కాబోతున్నారు. వీరిపై ఇప్పుడు రెండు కూటములు దృష్టి పెట్టాయి. ఎన్డీయేతర పార్టీలపై ఇప్పుడు మోదీ సర్కారు దృష్టి పడింది. ఇందులో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 20 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు..

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది. ఈ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీసీ మద్దతు చాలా అవసరం. ఇక అన్నాడీఎంకే కు నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారబోతున్నది. మరోవైపు ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్న బీజేడీ ఎన్డీఏకు ఇక తమ మద్దతు ఉండబోదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో వైఎస్సార్సీపీ ఎన్డీఏకు సంపూర్ణంగా సహకరించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందా.. లేదా అనేది కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరమవుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆ కూటమికి మద్దతునిస్తారా అనేది కీలకం కాబోతున్నది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మాజీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనను ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. అయితే వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేస్తారా.. ప్రస్తుతానికి మద్దతునిస్తారా అనేది త్వరలోనే నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Trending today

బ్రేకింగ్ : పాపులర్ యాంకర్ ని కిడ్నాప్ చేసిన రాజమౌళి

సినిమా ప్రమోషన్స్‌ అంటే రాజమౌళి ఓ రేంజ్ లో చేస్తాడు. అందులో...

టీవీ5 ‘సాంబ’న్న ఫస్ట్రేషన్

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర...

చంద్రబాబు  సెల్ఫ్ డబ్బా

విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు...

షుగర్ వచ్చినోడు బియ్యం తినడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ విధానంపై...

‘కూటమి’ని వణికించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్...

Topics

బ్రేకింగ్ : పాపులర్ యాంకర్ ని కిడ్నాప్ చేసిన రాజమౌళి

సినిమా ప్రమోషన్స్‌ అంటే రాజమౌళి ఓ రేంజ్ లో చేస్తాడు. అందులో...

టీవీ5 ‘సాంబ’న్న ఫస్ట్రేషన్

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర...

చంద్రబాబు  సెల్ఫ్ డబ్బా

విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు...

షుగర్ వచ్చినోడు బియ్యం తినడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ విధానంపై...

‘కూటమి’ని వణికించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్...

నన్నే ట్రోలింగ్ చేస్తారా? టీవీ5 సాంబశివరావు ఫైర్

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావు గారు మరోసారి సోషల్ మీడియాలో హాట్...

జూబ్లీహిల్స్ ఫలితం..ఏపీపై ప్రభావం ఎంతంటే?

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీఆర్ఎస్...

టీవీ5 సాంబాపై మాస్ ట్రోలింగ్

తెలుగు మీడియా రంగంలో తనదైన శైలి, తనదైన వ్యాఖ్యానాలతో సాంబ శివరావు...

Related Articles

Popular Categories