Top Stories

జగన్ ను శరణు కోరిన ‘ఎన్డీఏ’

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారుకు ఆదిలోనే చెక్ పడింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు ఎంపీల పదవీ కాలం ముగిసింది. ఇందులో నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, మహేశ్ జెఠ్మాలనీ, రామ్ షకిల్, సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. శనివారం వీరి పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు చేరింది. మొత్తంగా 245 సభ్యులున్న రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే మొత్తంగా ఎన్డీఏ కూలమి బలం ప్రస్తుతం 101కి చేరింది.

ఇండియా కూటమి బలం ఎంతంటే..

రాజ్యసభలో ఇండియా కూటమికి 87 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అయితే ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమిలో లేని సభ్యులు ఇప్పుడు కీలక బిల్లుల పాస్ లో కీలకం కాబోతున్నారు. వీరిపై ఇప్పుడు రెండు కూటములు దృష్టి పెట్టాయి. ఎన్డీయేతర పార్టీలపై ఇప్పుడు మోదీ సర్కారు దృష్టి పడింది. ఇందులో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 20 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు..

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది. ఈ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీసీ మద్దతు చాలా అవసరం. ఇక అన్నాడీఎంకే కు నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారబోతున్నది. మరోవైపు ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్న బీజేడీ ఎన్డీఏకు ఇక తమ మద్దతు ఉండబోదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో వైఎస్సార్సీపీ ఎన్డీఏకు సంపూర్ణంగా సహకరించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందా.. లేదా అనేది కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరమవుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆ కూటమికి మద్దతునిస్తారా అనేది కీలకం కాబోతున్నది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మాజీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనను ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. అయితే వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేస్తారా.. ప్రస్తుతానికి మద్దతునిస్తారా అనేది త్వరలోనే నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Trending today

మూర్తి పై మంచు లక్ష్మి ఫైర్!

జర్నలిస్ట్ మూర్తి , నటి మంచు లక్ష్మి మధ్య జరిగిన ఈ...

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు...

తిరుమల తిరుపతిలో ఘోర అపచారం

తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల మనసును కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. పవిత్రక్షేత్రంగా...

అనిత & సవిత.. అభాసుపాలు అయ్యారుగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డ్రామా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు...

చంద్రబాబు పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని ప్రముఖ జర్నలిస్ట్ ఏబీఎన్ వెంకటకృష్ణ...

Topics

మూర్తి పై మంచు లక్ష్మి ఫైర్!

జర్నలిస్ట్ మూర్తి , నటి మంచు లక్ష్మి మధ్య జరిగిన ఈ...

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు...

తిరుమల తిరుపతిలో ఘోర అపచారం

తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల మనసును కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. పవిత్రక్షేత్రంగా...

అనిత & సవిత.. అభాసుపాలు అయ్యారుగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డ్రామా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు...

చంద్రబాబు పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని ప్రముఖ జర్నలిస్ట్ ఏబీఎన్ వెంకటకృష్ణ...

వైసీపీకి బీజేపీ రిటర్న్ గిఫ్ట్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అవసరార్ధం వాడుకొని వదిలేసే వైఖరి కొత్త చర్చకు...

నాగార్జునకు వార్నింగ్ ఇచ్చిన దమ్ము శ్రీజ

‘అగ్నిపరీక్ష’ షోలో తన స్పష్టమైన పాయింట్స్‌తో ఆకట్టుకున్న దమ్ము శ్రీజ, బిగ్...

జడ శ్రవణ్ మాస్ ట్రోలింగ్!!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల...

Related Articles

Popular Categories