Top Stories

రఘురామకు అసెంబ్లీలో అవమానం

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. అక్కడున్న అధికారులపై మండిపడ్డారు.

మంత్రుల కాన్వాయ్‌ మాత్రమే లోపలికి అనుమితిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతమంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు రఘురామ.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు రఘురామరాజు. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్ట పడలేదు. ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. ఐతే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడుగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్ర‌య‌మిచ్చింది. తర్వాత ఉండి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories