Top Stories

బాలకృష్ణకు ‘మెంటల్ సర్టిఫికెట్’ కథ

 

ఒకానొక సమయంలో, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సంబంధించిన వార్తలను, చివరికి ఆయన సినిమాల ప్రకటనలను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించడం మానేసింది. ప్రకటనలు ఇవ్వకపోవడం వల్లే వార్తలు రావడం లేదని చాలా మంది భావించినప్పటికీ, అసలు కారణం వేరే ఉందని ఇప్పుడు వెల్లడైంది. ఈ విషయం ఇన్నాళ్లకు బయటపడటం, అది కూడా ఒక నెటిజన్ ద్వారా ఒక వీడియో వెలుగులోకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ తన ఛానెల్‌లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పేరుతో ఒక టాక్ షో నిర్వహించేవారు. సమాజంలోని భిన్న వర్గాలకు చెందిన వ్యక్తులతో ముఖాముఖి నిర్వహించి, వారి జీవితాల్లోని తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేసేవారు. ఈ కార్యక్రమం ద్వారా గొప్పవారిగా వెలుగొందుతున్న వారి అసలు కోణాలు బయటపడేవి. కొన్ని సందర్భాల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ వివాదాస్పదంగా మారిన రోజులు కూడా ఉన్నాయి. అయితే, వేమూరి రాధాకృష్ణకు ఇటువంటివి కావాలి కాబట్టి, వచ్చిన అతిథులను అదే తరహా ప్రశ్నలు అడిగి నిజాలు రాబట్టేవారు. వేమూరి రాధాకృష్ణ ఇలా చిత్రమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన వ్యక్తులలో నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు ఒకరు. సుప్రసిద్ధ వైద్యుడిగా పేరుగాంచిన కాకర్ల సుబ్బారావు నిమ్స్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేశారు, కీలకమైన కేసులను డీల్ చేశారు. అలాంటి సుబ్బారావును వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు.

బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన జరిగినప్పుడు, బాలకృష్ణను నిమ్స్‌కు తరలించారు. ఆ సమయంలో బాలకృష్ణ ఇంట్లో ఒక నిర్మాత ఉన్నట్లు, ఆయనకు బుల్లెట్ గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన చాలా విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ సంఘటనను ‘షుగర్ కోటెడ్’ చేసి చూపించడానికి ప్రయత్నించగా, సాక్షి మాత్రం అసలు విషయాన్ని నిర్భయంగా ప్రచురించింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం నడుపుతున్నందున సాక్షి నిర్భయంగా రాసింది. ఈ విషయంలో సాక్షిని అభినందించవచ్చు. ఆనాటి సంఘటనలో బాలకృష్ణకు నిమ్స్‌లో వైద్యం చేసిన బృందానికి కాకర్ల సుబ్బారావు నాయకత్వం వహించారు. ఆనాటి ఘటనలో ఏం జరిగిందో తెలియదు కానీ, బాలకృష్ణను కాపాడటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కాకర్ల సుబ్బారావు ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పేర్కొన్నారు. రాధాకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సుబ్బారావు సంచలన విషయాలను వెల్లడించారు.

“ఆనాడు బాలకృష్ణను కాపాడాలి. వేరే దారి లేదు. తప్పనిసరి పరిస్థితిలో మానసిక ధ్రువీకరణ పత్రం (మెంటల్ సర్టిఫికెట్) ఇవ్వాల్సి వచ్చిందని” సుబ్బారావు పేర్కొన్నారు. “మీరు ఇంత సహాయం చేశారు కాబట్టి తర్వాత మీ సేవలను గుర్తించారా?” అని వేమూరి రాధాకృష్ణ కాకర్ల సుబ్బారావును అడిగారు. “సహాయం అనే మాట పక్కన పెడితే… దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఆ ప్రస్తావన ఇక్కడ అనవసరం… తర్వాత చాలా జరిగిపోయాయని” సుబ్బారావు వ్యాఖ్యానించడంతో వేమూరి రాధాకృష్ణ ఆ టాపిక్‌ను డైవర్ట్ చేశారు.

కాకర్ల సుబ్బారావును వేమూరి రాధాకృష్ణ ఈ ప్రశ్న అడిగినప్పుడే బాలకృష్ణ క్యాంపుకు, ఆంధ్రజ్యోతికి మధ్య విభేదాలు మొదలయ్యాయని అంటుంటారు. రాధాకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించారు. దీంతో అటు బాలకృష్ణ, ఇటు వేమూరి రాధాకృష్ణ మధ్య “ఉప్పూ నిప్పూ” వ్యవహారం కొనసాగింది. ఫలితంగా చాలా రోజుల వరకు బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించలేదు. తర్వాత ఎవరు మధ్యవర్తిత్వం వహించారో తెలియదు కానీ, చివరికి ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఫలితంగా బాలకృష్ణ వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి, బాలకృష్ణ విషయాలు ఏబీఎన్‌లో వినిపిస్తున్నాయి.

https://www.instagram.com/reel/DMVPEy-ocDK/?igsh=MXF6Z2RiNmdwcDlkMQ==

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories