Top Stories

నీతులు చెప్పే ఏబీఎన్ ఆర్కే అసలు రూపం ఇదీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక మీడియా సంస్థ అధిపతి నిత్యం సమాజ ఉద్ధరణ గురించి అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాను మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా సదరు మీడియా సంస్థ యజమాని వ్యవహార శైలి ఉంటుంది. అయితే, సదరు మీడియా సంస్థ యజమాని చేసే పనికి, చెప్పే మాటలకు పొంతనే ఉండదు. ఆయనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల యజమాని వేమూరి రాధాకృష్ణ. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎదుటివారి ఇళ్లల్లో ఏం జరిగిందో చెప్పేందుకు తాపత్రయపడే రాధాకృష్ణ.. తన సంస్థలో జరుగుతున్న విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగులకు కనీస స్థాయిలో జీతాలను ఇవ్వలేని ఆయన.. ఇతరుల గురించి మాత్రం బాగానే చెబుతుంటారు. ఈ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు లైన్ ఎకౌంటు సరిగా ఇవ్వరనే అపవాదు ఉంది. ఒకవేళ ఇచ్చిన అది పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు. ఇక ఆ సంస్థ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్లు పేరుతో వేధింపులకు గురి చేస్తుంటారు. రిపోర్టర్లను వార్షిక చందాలు బుక్ చేయాలని కొన్ని నెలలపాటు ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వార్షిక చందాల ప్రక్రియను ఎలాగోలా పూర్తి చేశామని గుండెల మీద చేయి వేసుకునేసరికి.. వార్షికోత్సవ ప్రకటనల టార్గెట్ రిపోర్టర్ల ముందు పడుతుంది. లక్షలాది రూపాయలు యాడ్స్ చేస్తేనే గాని ఒప్పుకోను పరిస్థితి ఆ యాజమాన్యానిది. జిల్లా మేనేజర్లు ఆయా రిపోర్టర్లను లక్ష్యాలు చేరుకోవాలంటూ వేధిస్తుంటారు.

గడిచిన నెల రోజులుగా వార్షికోత్సవానికి సంబంధించిన తతంగం జరుగుతోంది. నెల రోజుల నుంచి కింద మీద పడుతున్న యాజమాన్యం విధించిన లక్ష్యంలో 50 శాతాన్ని కూడా చేరుకోలేకపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ సదరు మీడియా సంస్థ యజమానికి అనుకూలమైన ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఒకంత అసహనాన్ని యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వార్షికోత్సవ ప్రకటనల గొడుగును మరో 15 రోజులు పాటు పెంచినట్లు తెలిసింది. ఈ గడువులోగా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవాలని రిపోర్టర్లకు ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి వచ్చాయి.

ఒకవైపు సర్కులేషన్, మరోవైపు యాడ్స్ టార్గెట్లను చేరుకోలేక ఎంతో మంది రిపోర్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. కొందరు మాత్రం అందులోనే ఉండి ఈ బాధలను పడుతూనే ఉన్నారు. యాడ్స్ ఇవ్వకుంటే ఆ పత్రికలో వచ్చే కథనాలు వేరేగా ఉంటాయి అన్న ప్రచారం బయట ఉంది. పెద్దగోలుగా వార్తలు రాస్తూ ఇబ్బందులకు గురిచేస్తారన్న ఉద్దేశంతో చాలామంది ప్రకటనలు ఇస్తుంటారు. ఆ పత్రికలో వాడే భాష కూడా ఎబ్బెట్టుగానే ఉంటుందే అని పలువురు పేర్కొంటుంటారు. లైన్ అకౌంట్ అడిగితే వేధింపులకు గురి చేస్తుంటారని, తీరా వార్షికోత్సవాల సందర్భంగా మాత్రం లక్షలాది రూపాయలు ప్రకటనలు వేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారంటూ పలువురు రిపోర్టర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి నీతులు చెప్పే రాధాకృష్ణ ఇదా నీ అసలు రూపం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories