Top Stories

వైసీపీకి భారీ ఊరట- ఆయనకు విపక్ష నేత హోదా..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్ధితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకు అసెంబ్లీలో 10 శాతం సభ్యులు ఉన్న పార్టీకే విపక్ష నేత హోదా ఇస్తామని చెబుతోంది. దీంతో కేవలం 11 మంది ఎమ్మెల్యేల్ని గెల్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.

ఈ తరుణంలో వైసీపీకి శుభవార్త అందింది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదన్న కారణంతో విపక్ష నేత ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నా.. మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న ఆ పార్టీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ పేరిట సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇప్పటివరకూ అసెంబ్లీలో సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ పరిస్ధితి మెరుగ్గా కనిపిస్తోంది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories