టీవీ5 ఛానెల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత విషయాలు, ఛానెల్పై జరుగుతున్న ట్రోలింగ్పై స్పందిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వయస్సు (ఏజ్) గురించి, తన చర్యల గురించి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని, ట్రోల్ చేయకూడదని హెచ్చరించారు.
సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయ అనుభవాన్ని, పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ, తన వయస్సు గురించి వస్తున్న వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పారు. “నా ఏజ్ మీకు అనవసరం… మీకెందుకు అది??” అంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా బదులిచ్చారు. తాను ఒక ‘కరడుగట్టిన టీడీపీ కార్యకర్త’ నని పేర్కొన్నారు.
1984లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వద్దకు వచ్చింది నాకు తెలుసు అని వెల్లడించారు. ఆ నాటి సంఘటనలను తాను దగ్గర నుంచి చూశానని తెలిపారు. 1995లో ఎన్టీఆర్ గారిని దించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఉన్నాను. దగ్గరనుంచి చూశాను. ఈ విషయాలను కావాలంటే బుచ్చయ్య చౌదరి గారిని అడగండి అంటూ సవాలు విసిరారు.
టీవీ5 గురించి.. నా గురించి ట్రోల్స్ చేయకండి.. మీడియాలో రాయకూడదు. అది పద్ధతి కాదు అంటూ స్పష్టం చేశారు. తనపై ట్రోల్ చేస్తే బాగుండదని, టీవీ5 గురించి మరోసారి మాట్లాడితే బాగుండదు అంటూ రెచ్చిపోయారు.
ఈ సందర్భంగా, ‘ఎన్టీఆర్ ను చూశాం’ అని ప్రస్తావించడం ద్వారా తన సుదీర్ఘ రాజకీయ, మీడియా అనుభవాన్ని పరోక్షంగా తెలియజేశారు. వ్యక్తిగత అంశాలు, ఛానెల్పై వస్తున్న విమర్శలను లైవ్ షోలో తిప్పికొట్టడం చర్చనీయాంశమైంది.


