ప్రముఖ నటుడు ధర్మ మహేష్, మీడియా అధినేత TV5 మూర్తి మధ్య వ్యక్తిగత వివాదం తాజాగా తెలుగు మీడియా వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. తన భార్య గౌతమి వ్యవహారంలో మూర్తి జోక్యంపై ధర్మ మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సంచలన ఆరోపణలు చేశారు.
గత కొంతకాలంగా ధర్మ మహేష్ భార్య గౌతమికి మద్దతుగా TV5 మూర్తి తన డిబేట్లలో “శివతాండవంలాగా ఆడుతూ” రెచ్చిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మ మహేష్ విడుదల చేసిన ఒక వీడియో మూర్తి బండారాన్ని బయటపెట్టిందని అంటున్నారు.
“ఒక భర్త, ఒక భార్య, ఒక ఫ్లాటు, ఒక ప్లేటు… మధ్యలో TV5 మూర్తి” అంటూ ధర్మ మహేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “సంసారం మటాష్, బతుకులు బజారుకి” అంటూ ఆయన ఆరోపిస్తూ, తాను నివసించే ఫ్లాటులోకి మూర్తి వెళ్లి, అక్కడ తన భార్య గౌతమితో కలిసి భోజనం చేశారని, ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు.
ఒక జర్నలిస్టు ఒక వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇలా ప్రవర్తించడం నైతికత కాదని, తన భార్య విషయంలో మూర్తి అత్యుత్సాహం వెనుక కారణాలను ప్రశ్నిస్తూ ధర్మ మహేష్ విడుదల చేసిన ఈ వీడియో, మీడియా, సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై TV5 మూర్తి లేదా గౌతమి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.