జర్నలిజం అంటే ఏమిటి? డబ్బుకోసమా… పదవుల కోసమా… లేక ప్రజల కోసం పోరాడడమా? అనే చర్చ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ అంశాన్ని మరింత వేడెక్కించిన మాటలు TV5 చానెల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు.
“మేం జర్నలిజం చదవలేదు… కానీ జర్నలిజం అంటే ఏంటో మాకు తెలుసు. 30 ఏళ్లు సర్వీస్ ఉన్నా వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమిలాడం…ఎంగిలి మెతుకులు వేస్తే వారి గుణగణాలు పాడే జర్నలిజం మాది కాదు. డబ్బు కోసం, పదవుల కోసం పిచ్చిపిచ్చిగా మాట్లాడే జర్నలిజం మాకు రాదు. సిగ్గు లేని జర్నలిజం మాది కాదు!” అంటూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వ్యాఖ్యల వెనుక అసలు నేపథ్యం మరో సంచలనమే.ఇటీవల విమానయాన రంగంలో ఇండిగో సంక్షోభంపై నారా లోకేష్ ను, రామ్మోహన్ నాయుడును ప్రశ్నించిన Republic TV ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ఉద్దేశించి టీవీ5 సాంబశివరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
“మీరు అడిగే ప్రశ్నలు జర్నలిజం కాదు… అది రాజకీయ సేవ!” “నిజాన్ని నిలదీయడం జర్నలిజం… పదవుల కోసం వంగిపోవడం కాదు!” అంటూ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అటు మీడియా వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీశాయి.
ఈ రోజుల్లో చాలా చానెల్స్ రాజకీయ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయనే విమర్శలు పెరిగుతున్న సమయంలో సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ కు దారితీశాయి.

