టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఛానెల్పై వస్తున్న విమర్శలు, ఆరోపణలను ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. “పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!” అంటూ సాంబశివరావు చేసిన కామెంట్లు, ఆ తర్వాత ఆయన ప్రసంగించిన తీరు నెటిజన్లకు కొత్త ట్రోలింగ్ కంటెంట్ను అందించింది.
తమ ఛానెల్పై వ్యక్తమవుతున్న విమర్శలకు జవాబిస్తూ సాంబశివరావు గళం విప్పారు. తమ ప్రసారాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆయన హెచ్చరించారు.
సాంబశివరావు మాట్లాడుతూ… “టీవీ5 కనుక ఏదైనా తప్పుడు వార్త ప్రసారం చేసినా.. అబద్దపు వార్త ప్రచారం చేసినా మీరు చెప్పండి మేం సరిదిద్దుకుంటాం. మా మీద మాత్రం బురద చల్లొద్దు. మేము చెప్పే సత్యాలు, వాస్తవాలు మీరు తట్టుకోలేకపోతే, ఇంకా ఏదైనా చేద్దాం అనుకుంటే… అది మీ తరం కాదు,” అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
సాంబశివరావు వ్యాఖ్యలు ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్, ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. ఆయన మాట్లాడిన పంక్తులు, ఉద్వేగపూరిత హావభావాలను తీసుకుని నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఒక నెటిజన్ “సత్యాలు… వాస్తవాలు…” అంటూ సాంబశివరావు చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ సెటైరికల్ మీమ్ను పోస్ట్ చేయగా, మరొకరు “పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు” అనే కొటేషన్ను ట్రెండింగ్ చేశారు
నిజానికి, మీడియా సంస్థలపై విమర్శలు రావడం, వాటికి యాజమాన్యం తరపున కౌంటర్లు ఇవ్వడం సర్వసాధారణమే. అయితే, సాంబశివరావు తరచుగా తన ఛానెల్ వేదికగా వ్యక్తిగతంగా స్పందించడం, తీవ్రమైన పదజాలం వాడటం వల్ల ఆయన వ్యాఖ్యలు మరింత త్వరగా వైరల్ అవుతుంటాయి. ఈ తాజా ఉదంతం కూడా మరో ట్రోల్ ఫెస్ట్కు కారణమైంది.

