ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఒకప్పుడు ఊహాగానాలతో, టాలీవుడ్ స్టార్లపై చేసిన వ్యాఖ్యలతో పేరుపొందిన ఆయన తాజాగా అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం వద్ద చిక్కాడు.
పూజల కోసం ఆలయానికి చేరుకున్న వేణు స్వామి, అక్కడి పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడిపోయాడు. హిందీ, ఇంగ్లీష్లో వరుస ప్రశ్నల వర్షం కురవడంతో ఆయన నిశ్శబ్దం పాటించడం కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై టీవీ5 సీఈవో బీఆర్ మూర్తి స్పందిస్తూ, “వేణు స్వామి దొరికాడు… వాయించేశాడు” అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయన నిజ స్వరూపంపై చర్చించుకుంటున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ జంట విడాకులు తీసుకుంటారని చెప్పి సంచలనం సృష్టించిన వేణు స్వామి, తర్వాత యూట్యూబ్, టీవీ చానెల్స్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. కానీ విమర్శలు పెరగడంతో ఆ క్రేజ్ తగ్గిపోయింది.
ఇక ఇప్పుడు అస్సాంలో జరిగిన ఈ ఘటనతో, వేణు స్వామి మళ్లీ చర్చల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.