Top Stories

మాకు వద్దు ’బాబు’.. ఈయన మాటలు వింటే తట్టుకోలేరు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయింది. ఐదు నెలల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కనీసం ఏడాది నుంచి రెండు నెలలు సమయమైనా పడుతుంది. కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలలు పూర్తికాకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడంతోపాటు గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఐదు నెలలు కూటమి ప్రభుత్వ పాలనను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రజల ముందు మైక్‌ పెట్టి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగితే ఎంతో మంది తీవ్ర స్థాయిలో దుమ్మెతి పోశారు. నాలుగు నెలలు పాలన దరిద్రంగా ఉందంటూ ఒక పెద్దాయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నాలుగు నెలల్లో ఏమిచ్చాడో చెప్పాలని సదరు మీడియా ప్రతినిధిని ఆ పెద్దాయన తిరిగి ప్రశ్నించాడు. ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఇస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అక్కడ ఎవడు తింటున్నాడని, అక్కడకు వెళ్లి తింటే నాణ్యత ఏమిటో తెలుస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు సదరు పెద్దాయన. ఆ భోజనం మీరు తింటే బాధేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ పెన్షన్లును గతంలో జగన్మోహన్‌రెడ్డే ఇచ్చాడని, వీళ్లు కొత్తగా చేసిందేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు పని చేశారని, వారంతా ఇళ్ల వద్దకే తెచ్చి సంక్షేమ పథకాలను అందించారని, వారిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

వాలంటీర్లు మనుషులు కాదా..? వాళ్లు బతకొద్దా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుఫాన్‌ డబ్బులు ఎవడికైనా సరిగా పంచాడా..? చంద్రబాబు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పెద్దాయన.. ఎవడైనా గొప్పగా ఆడి గురించి చెప్పుకుంటున్నాడా..? అంటూ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చినట్టు మాటలు చెబుతున్నారని, పనులు మాత్రం జరగలేదంటూ చిర్రుబుర్రులాడారు. ఈ పెద్దాయన చెప్పిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగు నెలలకే ఈ స్థాయిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మిగిలిన కాలంలో ఇంకెంత చూడాలో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories